Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Indian Railways: శివ భక్తులకు శుభవార్త.. ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు.. రైల్వేశాఖ అవకాశం

13 February 2026

విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం

13 February 2026

IND vs PAK: పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌కు ఇచ్చిపడేసిన ఇషాన్.. ఏమన్నాడంటే?

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station
ఆంధ్రప్రదేశ్

Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఓ కానిస్టేబుల్ అప్రమత్తత.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. చర్లపల్లి – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు.. జారి పడబోయాడు. అయితే ఈ విషయాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గుర్తించి వెంటనే అతన్ని రక్షించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వివరాలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన దక్షిణ మధ్య రైల్వే కానిస్టేబుల్‌ను ప్రశంసించింది. ప్రయాణికులకు సూచనలు చేసింది.

Vijayawada railway station
ప్రయాణికుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్
రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండమంటూ రైల్వేస్టేషన్లలో నిత్యం ప్రకటనలు వింటూనే ఉంటాం. అలాగే బోర్డులపై ప్రకటనలు కూడా కనిపిస్తుంటాయి. కానీ పట్టించుకుంటేగా.. అలా పట్టించుకోకుండా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడి ప్రాణం రిస్కులో పడితే.. కానిస్టేబుల్ దేవుడిలా వచ్చి కాపాడిన ఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ మీద ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన రైల్వే కానిస్టేబుల్ అంటూ ఈ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే పంచుకుంది.

చర్లపల్లి – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతోంది. ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది. అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో బోగీలు నిండిపోయాయి. దీంతో ట్రైన్ డోర్ల వద్దే నిల్చుని ప్రయాణిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చర్లపల్లి – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కదులుతున్న రైలులోకి ఆదరాబాదరగా ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఉన్న గ్యాప్‌లో పడబోయాడు.

అయితే ఇదే సమయంలో ఎం. నరసింహారావు అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుడు రైలు నుంచి జారిపడుతున్న సంగతిని గుర్తించిన కానిస్టేబుల్ నరసింహారావు వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యన ఉన్న గ్యాప్‌లో పడకుండా అతన్ని ప్లాట్‌ఫామ్ మీదకు లాగారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌తో పాటుగా ఆ ప్రయాణికుడు, పక్కనే నిల్చున్న మరో ప్యాసింజర్ కూడా కింద పడిపోయారు. అయితే పట్టాలపై పడకుండా జాగ్రత్త వహించటంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే ఆ ప్రయాణికుడు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యన ఇరుక్కుపోయేవారు.
కానిస్టేబుల్ అప్రమత్తతతో అతని ప్రాణం నిలబడింది.

మరోవైపు ఈ ఘటన అనంతరం రైళ్లోని ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగటంతో.. రైలును ఆపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. దీంతో ప్రయాణికుణ్ని మళ్లీ అదే ట్రైనులోకి ఎక్కించారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ ప్రయాణికుడు.. తన కుటుంబంతో కలిసి తన జర్నీ కొనసాగించారు. ఈ వీడియోను పంచుకున్న దక్షిణ మధ్య రైల్వే.. కానిస్టేబుల్‌ను ప్రశంసించింది. అలాగే రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి