ఏపీలో రైలు ప్రయాణికులు పండగే.. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై అక్కడా ఆగుతాయి – kuppam railway station a new stoppage for train no 11005 dadar to puducherry and train no 17315 vasco da gama velankanni express trains
Two Express Trains Stoppage In Kuppam: ఈ నెల10 తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్లో కొత్తగా రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి స్టాపేజ్ ఇవ్వాలని అడిగారు. ఈ మేరకు వాస్కోడగామ-వేలాంకణ్ణి ఎక్స్ప్రెస్ రైలు, దాదర్ సెంట్రల్ – పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ ఇచ్చారు. ఈ మేరకు రైల్వేమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
హైలైట్:
కుప్పంలో కొత్తగా రెండు రైళ్లకు హాల్ట్
పుదుచ్చేరి ఎక్సప్రెస్ రైలు ఆగుతుంది
వాస్కోడగామ-వేలాంకణ్ణి ఎక్స్ప్రెస్ కూడా
కుప్పంలో రెండు ఎక్స్ప్రెస్లకు హాల్ట్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. కుప్పంలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపేజ్లు ఇచ్చారు.. ఈ మేరకు చంద్రబాబుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కుప్పం మీదుగా వెళ్లే రెండు ఎక్స్ప్రెస్లకు హాల్ట్ ఇస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి, వాస్కోడగామ-వేలాంకణ్ణి ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై కుప్పం రైల్వేస్టేషన్లో ఆగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. చంద్రబాబు ఈ నెల 10న ఢిల్లీలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను కుప్పంలో ఆపాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. కుప్పం మీదుగా నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ప్రజలు కోరుతున్నారని లేఖలో ప్రస్తావించారు. వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు రైల్వేశాఖ వేసవి సీజన్, హోలీ పండుగల రద్దీని గమనించి ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించారు. విశాఖపట్నం–చర్లపల్లి (08579/08580) వీక్లీ స్పెషల్ రైలు మార్చి 27 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు (08581/08582) వీక్లీ స్పెషల్ రైలు మార్చి 29 వరకు పొడిగించారు. విశాఖపట్నం–తిరుపతి (08547/08548) వీక్లీ స్పెషల్ మార్చి 25 వరకు పొడిగించారు.సంత్రగచ్చి–యల్లహంక (02863/02864) స్పెషల్ రైలును కూడా మార్చి 26 వరకు పొడిగించారు.
భువనేశ్వర్–యశ్వంత్పూర్ (02811/02812) ఏసీ స్పెషల్ రైలు మార్చి 28 వరకు పొడిగించారు. సంబల్పూర్–ఈరోడ్ (08311/08312) వీక్లీ స్పెషల్ రైలు మార్చి 25 వరకు పొడిగించారు. విశాఖపట్నం–తిరుపతి (08583/08584) స్పెషల్ రైలు మార్చి 30 వరకు పొడిగించారు. విశాఖపట్నం–షాలిమర్ (08508/08507) స్పెషల్ రైలు మార్చి 17 వరకు పొడిగించారు. తిరువనంతపురం నార్త్–సంత్రగచ్చి (06081/06082) వీక్లీ స్పెషల్ రైళ్లు ఫిబ్రవరి 20, 23 తేదీల వరకు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి