ఏలూరు: సూక్ష్మ కళతో ప్రజలను ఆకట్టుకున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ పెన్సిల్ మొనపై వివిధ కళాఖండాలు చెక్కి అనేక అవార్డ్స్ తో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
తాజాగా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివుడి ప్రతిమను పెన్సిల్ లీడ్ పై చెక్కారు. దీనిని తయారు చెయ్యటానికి ఎటువంటి సూక్ష్మ పరికరాలను వినియోగించకుండా గంటన్నర వ్యవధిలో తయారుచేశారు అని తెలిపారు. దీనిని చూసిన పలువురు విజయ్ మోహన్ ను అభినందిస్తున్నారు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పెన్సిల్ లీడ్ పై 246 లింకులు గొలుసు తయారు చేసినందుకు 2021 లో వచ్చింది. జ్యూస్ తయారు చేసే యంత్రం (అంగుళం ఎత్తు) , మజ్జిగ చిలికే యంత్రం (అంగుళం ఎత్తు) తయారు చేసినందుకు రెండు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ -2019 సంవత్సరంలో రావడం జరిగింది.
మూడు బియ్యపు గింజలపై జాతీయ గీతం (తెలుగు, ఆంగ్లం, హిందీ) బాషాల్లో 9 గంటల వ్యవధిలో 3 ఎటువంటి సూక్ష్మపరికారాలు ఉపయోగించకుండా చేసినందుకు 2018 సంవత్సరంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
2018 సంవత్సరo లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా రాష్ట్రీయ యువ గౌరవ అవార్డ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు 30 కి పైగా అవార్డ్స్ అండ్ రికార్డ్స్ వచ్చాయి.200 పైగా ఆర్ట్స్ చేశారు.






