
హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి హైదరాబాద్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారే టార్గెట్గా ఈ స్పెషల్ డ్రైవర్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డ్రైవ్ సమయంలో ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారి వాహనం సీజ్ చేయడంతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని. లైసెన్స్ వచ్చిన తర్వాతే వాహనాలు నడపాలని సూచిస్తు్నారు.
స్పెషల్ కౌన్సిలింగ్
అయితే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు. లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారికి లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ తీసుకునేందుకు సమయం కూడా ఇవ్వనున్నారు. అలా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాక.. కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి తమ వాహనాన్ని విడిపించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఓనర్పై కూడా కఠిన చర్యలు
ఇదిలా ఉండగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహన యజమానులు ఎవరికైనా తమ వాహనాన్ని ఇచ్చేముందు వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోవాలని, అలా చేయకుండా వాహనాలు ఇచ్చి ఇబ్బందుల్లో పడొద్దని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
