Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cinema : హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరంటే..

1 March 2026

Gold Loan: ఇరాన్‌-ఇజ్రాయిల్‌ వార్‌.. గోల్డ్‌ లోన్‌ తీసుకున్న వారికి బిగ్‌ అలర్ట్‌!

1 March 2026

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Garikapati Andhra Pradesh Name Change Demand,‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి.. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు’: గరికపాటి – garikapati narasimha rao demands to rename andhra pradesh as telugu nadu
ఆంధ్రప్రదేశ్

Garikapati Andhra Pradesh Name Change Demand,‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి.. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు’: గరికపాటి – garikapati narasimha rao demands to rename andhra pradesh as telugu nadu

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Garikapati Andhra Pradesh Name Change Demand,‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి.. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు’: గరికపాటి – garikapati narasimha rao demands to rename andhra pradesh as telugu nadu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదన్న ఆయన.. రాష్ట్రం పేరును ఎన్టీఆర్ కోరుకున్న విధంగా తెలుగు నాడు అని మార్చాలని సూచించారు. కేరళ వాళ్ల తరహాలోనే మనం కూడా పట్టుదలతో వ్యవహరించి రాష్ట్రం పేరును మార్చుకుంటే.. పేరు మాత్రమే కాకుండా మన బతుకులు కూడా మారతాయన్నారు.

హైలైట్:

  • ప్రపంచ తెలుగు మహాసభల్లో గరికపాటి కొత్త డిమాండ్
  • రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి
  • ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పేరు కాదన్న ప్రవచనకర్త
Garikapati On Andhra Pradesh Name Change
గరికపాటి నరసింహారావు(ఫోటోలు– Samayam Telugu)
కేరళ రాష్ట్రం పేరు మార్చడానికి కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రం పేరు మార్చే విషయమై కేరళ అసెంబ్లీ ఇప్పటికే పలు మార్లు తీర్మానాలు చేసింది. ఇటీవల రాష్ట్రం పేరు మార్చే తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఆమోదం తెలపగా.. కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేరళ పేరును కేరళంగా మార్చనున్నారు. ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సైతం ఇదే డిమాండ్ చేశారు.‘‘కేరళ వాళ్లకు ఉన్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకు లేదు. ఇటీవల కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా తెలుగునాడు అని మార్చాలి. అప్పుడే మనకు జాతీయాభిమానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. మన రాష్ట్రం పేరును తమిళనాడు లాగే.. తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే కేరళ వాళ్లు ఇబ్బందయ్యింది. మా రాష్ట్రం, మా భాష.. మార్చాల్సిందే అనుకున్నారు. కేరళ పేరును కేరళంగా మార్చుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరే కాదు మన బతుకులు కూడా మారతాయి’’ అని గరికపాటి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమలాపురంలో నిర్వహిస్తూన్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తూ గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.

మహర్షులు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు తప్పుకోవడం మనం ఒత్తిడిలో జీవిస్తున్నామని గరికపాటి వ్యాఖ్యానించారు. తల్లి కడుపులో నుంచి బయటకొచ్చింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ ఆందోళనతోనే ఉంటున్నారన్నారని ఆయన తెలిపారు. ఆత్మసిద్ధి పొందడం కోసం ఒకటో తెలుగు వాచకంలోనే నాలుగు మాటలు పెట్టారన్నారు. ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బతుకుతుందన్నారు. తన ఇద్దరు పిల్లలను తాను తెలుగు మీడియంలోనే చదివించానని ఆయన చెప్పారు. తెలుగు మాధ్యమం వల్ల ఎవరూ నష్టపోలేదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదవాలని నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సొంత దేశంలోనే ఉండాలని, ఇక్కడే పని చేయాలని అనుకుంటే భారతదేశం ఐదేళ్లలోనే విశ్వగురువుగా మారుతుందన్నారు.

తెలుగు పేరు కోసం ఏన్టీఆర్ కృషి..

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఆంధ్ర అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుందని.. తెలుగు అనేది భాషాపరంగా అందర్నీ ఏకం చేస్తుందని ఆయన నమ్మారు. అందుకే రాష్ట్రం పేరు మార్చే విషయమై ఆయన అసెంబ్లీలో చర్చలు జరిపారు. కొందరు ఆయన ఆలోచనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాష్ట్రం పేరును మార్చలేకపోయారు. అయినప్పటికీ.. తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథం లాంటి పేర్లతో ఆయన తెలుగు పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.

రవి కుమార్

రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఏపీ, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయంతోపాటు క్రికెట్‌కు సంబంధించిన ముఖ్య అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తుంటారు. రవి కుమార్‌కు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో భాగం పంచుకున్నారు. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కథనాలు రాశారు. వీడియో ప్రాజెక్టుతోపాటు ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్‌ల కోసం పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. పీజీ చదివిన రవి కుమార్ ఈజేఎస్ నుంచి వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు.… ఇంకా చదవండి