చిరువ్యాపారులు, మహిళలకు ఏపీ సీఆర్డీఏ మంచి అవకాశం కల్పిస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ మీద శిక్షణ తరగతులు నిర్వహించనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13 వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్, సోషల్ మీడియా ద్వారా వ్యాపారాభివృద్ధిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సీఆర్డీఏ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఎవరెవరు అర్హులు అంటే..
డ్వాక్రా మహిళా సంఘాలలో సభ్యులు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు, చిరు వ్యాపారులు.. ఈ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అర్హులు. మార్చి 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంటే మార్చి 13వ తేదీ వరకూ ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు.. తమ వ్యాపారాలను ఎలా పెంచుకోవచ్చనే దానిపై ఈ శిక్షణ తరగతులలో అవగాహన కల్పిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార అభివృద్ధిపై సలహాలు, సూచనలు అందిస్తారు. దీని ద్వారా అమరావతి, విజయవాడ ప్రాంతాల్లోని గృహిణులు, చిరు వ్యాపారులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీఆర్డీఏ కార్యాలయం సూచించింది.
మరోవైపు స్వయం ఉపాధి పొందే మహిళలు, చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీని ద్వారా వ్యాపారాన్ని టెక్నాలజీ సాయంతో ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనేదీ తెలుస్తుందని చెప్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన కలుగుతుందని.. దీని ద్వారా వ్యాపారాభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉంటాయంటున్నారు.


