10 Oct 2024 09:12 AM (IST)
రతన్టాటాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో సత్కరించిన భారత ప్రభుత్వం
నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం రెండు అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్ అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది.
10 Oct 2024 09:10 AM (IST)
టాటా గ్రూప్ చైర్మన్గా రెండు దశాబ్ధాల కాలంపాటు రతన్ టాటా సేవలు
1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా సేవలు అందించారు. 2016-17 మధ్య తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. టాటా చారిటబుల్ ట్రస్టులకు కూడా రతన్టాటా చైర్మన్గా వ్యవహరించారు. అనేక స్టార్టప్లను ప్రోత్సహించిన రతన్టాటా.. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు.
10 Oct 2024 09:07 AM (IST)
రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వారు చాలా అరుదని అన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు తెలిపారు.
10 Oct 2024 09:05 AM (IST)
‘..యావత్ దేశానికి తీరని లోటు’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
10 Oct 2024 09:02 AM (IST)
ముంబైలోని NCPAలో రతన్ టాటా పార్థివ దేహం.. ప్రజల సందర్శనార్ధంఉదయం 10.30 గంటల నుంచి అనుమతి
ప్రజల సందర్శనార్ధం రతన్ టాటా పార్థివ దేహాన్ని గురువారం ముంబైలోని ఎన్సీపీఏలో ఉదయం 10.30 గంటల నుంచి ఉంచనున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
10 Oct 2024 08:57 AM (IST)
నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంతాప దినం
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు గురువారం (అక్టోబర్ 10) సంతాప దినాలుగా ప్రకటించాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ వేధికగా తెలిపారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కూడా రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినాలు ప్రకటించారు. జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటించారు’ అని ‘X’లో ఒక పోస్ట్లో రాశారు.
10 Oct 2024 08:54 AM (IST)
శోకసంద్రంలో యావత్ దేశం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం
చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. ఆయన మృతితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
10 Oct 2024 08:48 AM (IST)
ప్రభుత్వ లాంఛనాలతో నేటి సాయంత్రం అంత్యక్రియలు
ఈ రోజు సాయంత్రం రతన్ టాటా పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు.

