Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Apple iPhone: ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! ఈ మోడల్స్‌పై ధర భారీగా తగ్గింపు!

3 March 2026

ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ రాలేదు..! విషయం చెప్పిన భరణి

3 March 2026

భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా? ఇది తెలుసుకోండి..

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Temple Reopens,Tirumala: శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభం.. అన్నప్రసాద వితరణ మొదలు.. – tirumala temple reopens after chandra grahananantara suddi and allowed devotees to darshan
ఆంధ్రప్రదేశ్

Tirumala Temple Reopens,Tirumala: శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభం.. అన్నప్రసాద వితరణ మొదలు.. – tirumala temple reopens after chandra grahananantara suddi and allowed devotees to darshan

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Temple Reopens,Tirumala: శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభం.. అన్నప్రసాద వితరణ మొదలు.. – tirumala temple reopens after chandra grahananantara suddi and allowed devotees to darshan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే అన్న ప్రసాద వితరణ కూడా తిరిగి ప్రారంభమైంది. లడ్డూ కౌంటర్లు కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చారు.

Tirumala Temple Reopens
తెరుచుకున్న శ్రీవారి ఆలయం(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంట‌ల నుంచి తిరుమలలో భ‌క్తుల‌కు ద‌ర్శనం ప్రారంభ‌మైంది. మంగళవారం మధ్యాహ్నం 3.26 గంటల నుంచి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు తిరుమల శ్రీవారి ఆల‌య త‌లుపులు మూసివేశారు. సుమారు10.30 గంట‌ల తర్వాత మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు తిరుమల ఆల‌య త‌లుపులను తిరిగి తెరిచారు. అనంతరం ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించారు.

మరోవైపు చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంట‌లకు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాదం కాంప్లెక్సు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం.. రాత్రి 8.30 గంట‌ల నుంచి శ్రీవారి భ‌క్తుల‌కు అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అలాగే లడ్డు కౌంటర్లు కూడా తిరిగి తెరిచారు.

ఘనంగా కుమార ధార తీర్థ ముక్కోటి

మరోవైపు తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటిని మంగళవారం రోజున వైభవంగా నిర్వహించారు. అయితే చంద్ర గ్రహణం నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను కుమార ధార తీర్థానికి అనుమతించారు. భక్తుల కోసం టీటీడీ అన్న ప్రసాద విభాగ సిబ్బంది.. పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

పలమనేరు గోశాలను పరిశీలించిన జేఈవో

మరోవైపు టీటీడీ జేఈవో శరత్ పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలను పరిశీలించారు. గోశాలలో ఉన్న పశువులకు సమయానికి మేత, త్రాగునీరు అందించాలని.. అవసరమైన వైద్య సేవలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పలమనేరులో 450 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ గోశాల ఉంది. ఇందులో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయి. మరోవైపు గోశాలలోని పశువులకు 13 ఎకరాల్లో పచ్చిమేత అందుబాటులో ఉందని జేఈవో శరత్ తెలిపారు. మరింత విస్తీర్ణంలో పచ్చి గడ్డి సాగు చేయాలని సూచించారు.

పశువుల దాణా, షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసేలా..ప్రతి షెడ్‌లోనూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పశువులకు నీడ కల్పించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని.. బెంగుళూరులోని శ్రీ శ్రీ గోశాలను సందర్శించి, అక్కడ అమలయ్యే మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని టీటీడీ జేఈవో శరత్ సూచించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి