Nara Lokesh Krishna River Retaining Wall,మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్.. రూ.294.20 కోట్లతో తాడేపల్లి రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన – ap minister nara lokesh to lay foundation stone for krishna river retaining wall
Nara Lokesh Foundation For Krishna River Retaining Wall: ఏపీ మంత్రి లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. రూ.294.20 కోట్లతో కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భారీ వరదల్ని సైతం తట్టుకునేలా ఈ వాల్ను నిర్మిస్తున్నారు. ఏడాది కాలంలోనే పరిపాలన అనుమతులు రాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి.. త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
హైలైట్:
మరో హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
తాడేపల్లి రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన
రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం
తాడేపల్లి కృష్ణా నది రిటైనింగ్ వాల్,(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే.. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నారు.. ఏడాది కాలంలోనే ఈ పనులకు సంబంధించి పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు మంత్రి లోకేష్.. టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు.. ఇవాళ శంకుస్థాపన పూర్తి చేశారు. ఈ రిటైనింగ్ వాల్ను భవిష్యత్లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మిస్తారు. కృష్ణా నదిలో 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా రిటైనింగ్ వాల్ను ప్లాన్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు కృష్ణా నది కుడివైపు వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ను కేవలం మామూలు గోడగా నిర్మించడం లేదు.. అక్కడ భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి.. పైల్- రాఫ్ట్ సాంకేతికతతో నిర్మిస్తారు. నీళ్ల ఉధృతితో పాటుగా భూకంపాలను సైతం తట్టుకునెలా ఈ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే తాడేపల్లి సమీపంలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో పాటూ పలు లోతట్టు ప్రాంతాలవారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రిటైనింగ్ వాల్తో దాదాపు 50వేల మంది ప్రజలు వరద ప్రభావం లేకుండా ఇబ్బందులు తొలగిపోయాయి. అంతేకాదు ఈ రిటైనింగ్ వాల్ అమరావతిలోని పలు ప్రాంతాలు, నేషనల్ హైవే 65కు కూడా రక్షణగా నిలవనుంది.
అలాగే మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో కమ్యూనిటీ హాల్ను కూడా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తాడేపల్లిలోని నులకపేటలో కమ్యూనిటీ హాల్ను నూతనంగా నిర్మించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. వీటితో పాటుగా మంగళగిరి నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి