Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ola Electric Fined 20000 In Vizag,విశాఖపట్నం: సర్వీస్ లోపం.. ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.20,000 జరిమానా – ola electric fined 20000 for service deficiency in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Ola Electric Fined 20000 In Vizag,విశాఖపట్నం: సర్వీస్ లోపం.. ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.20,000 జరిమానా – ola electric fined 20000 for service deficiency in visakhapatnam

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ola Electric Fined 20000 In Vizag,విశాఖపట్నం: సర్వీస్ లోపం.. ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.20,000 జరిమానా – ola electric fined 20000 for service deficiency in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ సంస్థకు విశాఖపట్నంలోని వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్ సర్వీసులో లోపంతో పాటుగా కస్టమర్ మానసిక వేదనకు గురయ్యేలా చేశారంటూ ఓలా సంస్థకు రూ.20 వేలు జరిమానా విధించింది. అతని ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని లోపాలను ఉచితంగా సరిచేయాలని ఆదేశించింది.చట్టపరమైన ఖర్చుల కింద మరో పదివేలు ఇవ్వాలని ఆదేశించింది.

ola
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.20,000 జరిమానా(ఫోటోలు– Samayam Telugu)
వినియోగదారుడికి సర్వీసులో లోపం కలిగించారనే కారణంతో ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్‌కు విశాఖపట్నంలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ -2.. రూ.20 వేలు జరిమానా విధించింది. ఫిర్యాదుదారుకు సేవలో లోపంతో పాటుగా మానసిక వేదనకు కూడా కారణమయ్యారంటూ రూ.20,000 పరిహారం చెల్లించాలని ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్‌ను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారు వాహనం సజావుగా పనిచేయడానికి ఈ-స్కూటర్‌లోని లోపాలను సరిచేయాలని కూడా కమిషన్ ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ.10 వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్‌ సంస్థను ఆదేశించింది.

ఫిర్యాదుదారు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతానికి చెందిన వై. భరత్ కుమార్ అనే వ్యక్తి.. 2024 ఏప్రిల్ నెలలో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా చెల్లించారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత స్కూటర్‌లో సమస్యలు మొదలయ్యాయి. స్టార్టింగ్ ప్రాబ్లమ్, సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తాయి. దీనిపై పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, సర్వీస్ అభ్యర్థనలు పెట్టినప్పటికీ ప్రయోజనం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సమస్యలు అలాగే కొనసాగాయి.

దీంతో విసుగెత్తిపోయిన భరత్ కుమార్.. వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. వాహనాన్ని రీప్లేస్ చేయటం లేదా పూర్తి రీఫండ్ చెల్లించాలని ఆదేశించాలంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటుగా సర్వీసులో లోపం నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కస్టమర్ లేవనెత్తిన సమస్యలను తమ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వెంటనే పరిష్కరించిందని, తనిఖీలతో పాటుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రొసీజర్ ప్రకారం నిర్వహించామని ఓలా సంస్థ కౌంటర్ దాఖలు చేసింది. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి తయారీ లోపాలు లేవని వాదించింది. రీప్లేస్‌మెంట్ లేదా ఫుల్ రీఫండ్ డిమాండ్ అన్యాయమని కంపెనీ పేర్కొంది.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల కమిషన్.. వినియోగదారుడు పదే పదే అభ్యర్థించినప్పటికీ కంపెనీ చర్యలు తీసుకోకపోవటం, లోపాలను సరిదిద్దడానికి ఇష్టపడకపోవడం సేవా లోపంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఇలాంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులు ఫిర్యాదుదారునికి మానసిక వేదన కలిగించాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ సంస్థకు 20 వేలు జరిమానా విధించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లోపాలను ఉచితంగా సరిదిద్దాలని, స్కూటర్ సజావుగా నడపడానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించింది. అలాగే అవసరమైతే పనిచేయని సాఫ్ట్‌వేర్ భాగాలను భర్తీ చేయాలని ఓలా ఎలక్ట్రిక్‌ను ఆదేశించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి