
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచబోమని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధన ధరలు పెరగవని స్పష్టం చేయడం సామాన్యులకు ఊరటనిచ్చింది. ప్రజలపై భారం పడకుండా ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భరించాలని ఆదేశించింది. దీంతో కొంతకాలంగా పెట్రోల్ బంకుల్లో ఏర్పడిన క్యూలు, ధరలు పెరుగుతాయేమోనన్న భయాలు, పుకార్లకు తెరపడింది. దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇంధన ధరల పెరుగుదల భారం ప్రజలపై పడకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని కేంద్రం తేల్చిచెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్
మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ
Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక
ఆరునూరైనా.. ట్రంప్ను మాత్రం వదిలిపెట్టం
Summer: సందడి లేని సమ్మర్.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!

