Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఫెయిల్యూర్ అంటూ ఛీకొట్టారు.. కట్‌చేస్తే.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌తో ఇచ్చిపడేసిన ఫ్యూచర్ స్టార్?

12 March 2026

శివుడి మూడో కన్ను.. మకర తోరణం.. వీటి వెనుకున్న రహస్యం తెలుసా..?

12 March 2026

Alert: వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Registered As Sadhikara Saaradhi,టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు – ap cm chandrababu naidu also registered as sadhikara saaradhi in kadapalle panchayat in kuppam
ఆంధ్రప్రదేశ్

Chandrababu Registered As Sadhikara Saaradhi,టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు – ap cm chandrababu naidu also registered as sadhikara saaradhi in kadapalle panchayat in kuppam

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Registered As Sadhikara Saaradhi,టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు – ap cm chandrababu naidu also registered as sadhikara saaradhi in kadapalle panchayat in kuppam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chandrababu Registered As Sadhikara Saaradhi In Kuppam: టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు.

హైలైట్:

  • టీడీపీ కుటుంబ సాధికార సారథిగా చంద్రబాబు పేరు
  • కుప్పంలోని కడపల్లె పంచాయతీలో పేరు నమోదు
  • బాబుకు 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు
Chandrababu Also Sadhikara Saaradhi
కుటుంబ సాధికార సారథిగా చంద్రబాబు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిగా పార్టీ కార్యకర్తల్ని నియమించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి వ్యవస్థను నియమించారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా కుటుంబ సాధికార సారథిగా నమోదయ్యింది. చంద్రబాబు పేరును చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేయడం విశేషం. కడపల్లె పంచాయతీలో చంద్రబాబు కూడా సాధారణ కార్యకర్తలా టీడీపీ కుటుంబ సాధికార సారథిగా బాధ్యతల్లో ఉన్నారన్నమాట.ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని కడపల్లె పరిధి శివపురంలో నివాసాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును కూడా కడపల్లె పంచాయతీలో టీడీపీ తరఫున ప్రతినిధిగా కుటుంబ సాధికార సారథి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. చంద్రబాబుకు తిమ్మరాజు పల్లె పోలింగ్ బూత్ నంబర్ 49లోని 181 నుంచి 240 వరకు ఉన్న 60మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథి వ్యవహరిస్తారు. అక్కడి ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ఎలా లబ్ధి పొందారు, పెండింగ్‌ సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు కుటుంబ సాధికార సారథిగా ఇప్పటికే ఓటర్లను ఒకసారి కలిశారు. గతేడాది జూలై 2న తిమ్మరాజుపల్లెలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిప్రాయాలను సేకరించారు.

ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే చంద్రబాబుకు కూడా పార్టీలో సాధారణ కార్యకర్త నిర్వహించే బాధ్యతల్ని అప్పగించడం విశేషం. గతేడాది నెల రోజుల పాటూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కుటుంబ సాధికార సారథుల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుల వరకు అందరూ ప్రజల్ని కలిశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి వివరాలు తెలియజేశారు. అయితే చంద్రబాబుకు కూడా కుటుంబ సాధికార సారథి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి