Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? కారణాలు ఇవేనా?

16 March 2026

Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గిన బంగారం ధరలు

16 March 2026

ఏం పాట రా బాబు..! మైండ్‌లోనుంచి పొవట్లే..!! లవర్స్ తెగ పాడేసుకుంటున్న సాంగ్

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Towers Steel Diagrid,అమరావతి: హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం.. – minister narayana starts first steel diagrid work in amaravati hod towers
ఆంధ్రప్రదేశ్

Amaravati Towers Steel Diagrid,అమరావతి: హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం.. – minister narayana starts first steel diagrid work in amaravati hod towers

.By .16 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Towers Steel Diagrid,అమరావతి: హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం.. – minister narayana starts first steel diagrid work in amaravati hod towers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా జీఏడీ, హెచ్ఓడీ టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జీఏడీ టవర్ 47 అంతస్థులతో, మిగతా నాలుగు హెచ్ఓడీ టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే టవర్ -1కు సంబంధించి మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2028 అక్టోబర్ నాటికల్లో టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

amaravati
అమరావతి టవర్లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులలో వేగం పెరిగింది. సోమవారం రోజున అమరావతిలోని హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో భాగంగా టవర్ -1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం విలేకర్లతో మాట్లాడిన మంత్రి నారాయణ .. అమరావతి రైతులకు చెప్పిన మాట ప్రకారమే రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి జీఏడీ, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో భాగంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో మొత్తం ఐదు టవర్లు నిర్మిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.

47 అంతస్తులలో జీఏడీ టవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. మిగతా టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 53 లక్షల చదరపు అడుగుల బిల్డ్ ఏరియాతో టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని కార్యాలయాలు, అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా ఈ టవర్లను డిజైన్ చేసినట్లు తెలిపారు. 2028 అక్టోబర్ నాటికి జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

మరోవైపు మూడు ప్యాకేజీల కింద అమరావతిలో టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టారు. మొదటి ప్యాకేజీ కింద రూ.1,126.51 కోట్లతో జీఏడీ టవర్‌ నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీ పనుల కింద 1,897.86 కోట్ల రూపాయలతో 1, 2 టవర్లు నిర్మించనున్నారు. మూడో ప్యాకేజీ పనుల కింద రూ.1,664.45 కోట్లతో మూడు, నాలుగో టవర్లు నిర్మించనున్నారు. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం డయాగ్రిడ్ విధానంలో చేపట్టనున్నారు.

టవర్లలో జీఏడీ టవర్ అన్నింటికంటే ఎత్తు ఉండనుంది. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా జీఏడీ టవర్‌‌ను 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే సీఎం ఆఫీస్ ఉంటుంది. జీఏడీ టవర్ టెర్రస్‌పై హెలిప్యాడ్‌ నిర్మించనున్నారు. మిగతా నాలుగు హెచ్ఓడీ టవర్లను 40 అంతస్తుల చొప్పున నిర్మించనున్నారు. ఇక ఈ డిజైన్ 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందని అంచనా.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి