Andhra Pradesh Rains,ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు పడతాయి జాగ్రత్త – rains and high temperatures in these districts at andhra pradesh
Andhra Pradesh Rain Updates: ఆంధ్రప్రదేదశ్లో రాబోయే నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే పిడుగులతో పాటు గంటకు గరిష్ఠంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారుజ. కోస్తాలోని కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.
హైలైట్:
ఏపీలో విభిన్నమైన వాతావరణం
ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు
ప్రజలకు ఎండల నుంచి ఊరట
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణం కనిపిస్తోంది.. కొన్ని జిల్లాల్లో వానలు, మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తోంది. నేడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణవాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు పడతాయంటోంది. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రజలు పిడుగుపాటుపట్ల అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. అయితే ఈ వర్షాలు నాలుగు రోజుల వరకు ఉంటాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో వర్షం కురిసింది. సోమవారం ఈదురుగాలులు, వడగళ్లతో భారీ వాన పడింది. విచిత్రంగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటే.. ఆ తర్వాత వాతావరణం మారిపోయిది. ఒక్కసారిగా కుండపోత వర్షు కురిసింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాల్లో సోమవారం ఎండల తీవ్రత కనిపించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. అయితే కోస్తా జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. అయితే రాబోయే ఐదు రోజులు కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత కొంత తగ్గుతుందని చెబుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి.
ఈసారి మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరిగింది. మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు.. ఈ క్రమంలో వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో వాతావరణం కాస్త చల్లబడనుంది. అయితే వేడిగాలుల తీవ్రత పెరుగుతుందనే భయం జనాల్ని వెంటాడుతోంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి