Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hair Care: చిక్కులు పడే జుట్టుకి కిచెన్‌లో దొరికే ఈ 5 వస్తువులతో చెక్ పెట్టండి

22 March 2026

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

22 March 2026

చియా Vs సబ్జా.. వీటిని ఇలా తిన్నారో ప్రాణాలకే రిస్క్.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme
ఆంధ్రప్రదేశ్

Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


టీటీడీకి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ సంస్థ కోటి రూపాయలు విరాళంగా అదించింది. సుబ్బరావు అపారల్స్ అనే సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించింది. విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి దాత రాజా రమేష్ ఆదివారం అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు

TTD Donatons
సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ విరాళం(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన సుబ్బరావ్ అపారల్స్ అనే సంస్థ టీటీడీకి కోటి రూపాయలు విరాళంగా అందించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. కోటి విరాళంగా అందించారు. ఆదివారం రోజు దాత రాజా రమేష్ టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సైతం హాజరయ్యారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని స్విమ్స్ ఆస్పత్రిలో టీటీడీ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలు, అర్హులైన రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తారు. ఈ క్రమంలోనే పలువురు దాతలు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి తమవంతు విరాళాలు అందించి సామాజిక సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చెన్నై సంస్థ కోటి రూపాయలు విరాళంగా అందించింది.

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 01 తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 30వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తైన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

మార్చి 31వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి స్వామివారు మాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ మలయప్పస్వామితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు.

వసంతోత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజులు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. వసంతోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి