
టీవీ9 నెట్వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము ఎవరి పక్షాన ఉంటాం? అని అడిగేవారికి మా సమాధానం ఒక్కటే.. మేము దేశ ప్రయోజనాల పక్షాన ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుండి ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావం ఏ దేశంపై పడకుండా ఉండటం అసాధ్యమని ప్రధాని అన్నారు. యుద్ధాలు మన సరిహద్దులకు దూరంగా జరుగుతున్నప్పటికీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారతదేశం తన అభివృద్ధి వేగాన్ని తగ్గించలేదని ఆయన గర్వంగా ప్రకటించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

