
హిందూ ధర్మంలో శ్రీరామనవమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకు సీతారాముల కళ్యాణోత్సవాలతో పండగ వాతావరణం నెలకొంటుంది. సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల కోరిన కోరికలు తీరడంతోపాటు శుభ ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి పర్వదినం పెళ్లికాని యువతీ యువకులకు ఆశలు చిగురింపజేసే ఒక అద్భుత పరిష్కారాన్ని అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొందరి జాతకాలలో కుజ దోషం, శుక్ర దోషం, కాలసర్ప దోషం వంటివి వివాహాలు ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. అయితే, ఈ దోషాలను తొలగించే శక్తి దైవానికే ఉంది, ఆ దైవం సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి.
ప్రాచీన సంప్రదాయాల ప్రకారం, మీన చైత్రం పేరుతో రాములవారి కళ్యాణ తిథి అయిన దశమి, నవమి తిథుల కంటే ముందు గృహాలలో వివాహాలు జరిగేవి కావు. అప్పట్లో మీన చైత్రంలో ఉపనయనాలు మాత్రమే నిర్వహించి, “ముండనం నతు మండనం” అనే ప్రమాణాన్ని పాటించేవారు. శ్రీరాములవారి కళ్యాణం జరిగిన తర్వాత, ఆ పవిత్రమైన తలంబ్రాలను ఇంటిలో వివాహం కానటువంటి యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే, వారికి వివాహయోగం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ ఆచారాన్ని పాటిస్తూ, శ్రీరాముని అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తిని పొందవచ్చని ప్రగాఢ విశ్వాసం. ఇంకేముంది మీరే ఇలాగే చేసి వివాహ యోగం పొందండి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

