Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ.. ఇలా వండారో గిన్నెలు ఊడ్చాల్సిందే

16 March 2026

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?
తాజా వార్తలు

Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి బలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. వరుసగా మూడు పర్యాయాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరోసారి గెలుపొందాలని చూస్తుండగా.. ఈ విజయ పరంపరకు బ్రేకులు వేసి ఢిల్లీ పీఠంలో జెండా ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) అన్ని శక్తులూ ఒడ్డి పోరాడుతోంది.

ఈ రెండు పార్టీలతో పాటు ఉనికి చాటుకోవడం కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకట్టుకోడానికి హామీలతో ఎర వేస్తోంది. అనధికార కాలనీల్లో నివాసముంటున్న ఓటర్లను ఆకట్టుకోడానికి బీజేపీ ఆయా కాలనీవాసులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ భారీ హామీ ప్రకటించగా.. ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ అధికార ఆప్ మేనిఫెస్టోలో పేర్కొంది. కొత్త హామీలు, వాగ్దానాలే కాదు.. యమునా నది ప్రక్షాళన వంటి పాత వాటిని కూడా మళ్లీ మేనిఫెస్టోలో చేర్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు ఓటర్ల కోసం ఇచ్చిన హామీలేంటో ఓసారి పరిశీలిద్దాం…

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హామీలు

1. జన సంఖ్యలో సగం, ఓటర్లలో సగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,100 అందిస్తామంటూ భారీ ప్రకటన చేసింది. ఈ మేరకు దరఖాస్తు పత్రాలను కూడా నింపడం కూడా ప్రారంభించింది. ఢిల్లీలో ఓటు హక్కు కల్గిన ప్రతి మహిళకు ఈ సదుపాయం వర్తిస్తుందని హామీ ఇచ్చింది.

2. ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మెట్రో ప్రయాణాన్ని కూడా ఉచితంగా చేయాలనుకుంటున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

3. ఢిల్లీ నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న మురుగునీటి కాల్వల విషయంలోనూ కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో అన్ని మురుగు నీటి కాల్వలను బాగుచేస్తామని చెప్పారు.

4. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని ఇచ్చామని కేజ్రీవాల్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే పైప్ లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తామని చెప్పారు.

5. వృద్ధులకు సంజీవని పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.

6. ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమాను ఆప్ ప్రకటించింది. అలాగే ప్రభుత్వం రాగానే ఆటోడ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ. 5,000, కూతురు పెళ్లికి రూ. లక్ష అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

7. ఢిల్లీ ఎన్నికల్లో అర్చకులు, పూజారుల కోసం ఆప్ పెద్ద ప్రకటన చేసింది. ఆప్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేవాలయాల పూజారులు, గురుద్వారాల పూజారులకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

8. ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ పథకం కింద ఇప్పటికే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాగానే అద్దెకు ఉండేవారికి కూడా ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు.

9. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళలు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ 2020లో ఈ పథకాన్ని ప్రకటించి అమలు చేస్తున్నారు.

10. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ భీంరావు అంబేద్కర్ సమ్మాన్ కింద విదేశాల్లో చదువుతున్న దళిత విద్యార్థుల ఖర్చులన్నీ భరిస్తామని ప్రకటించింది. దళిత విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఈ పథకం అమల్లోకి వస్తుంది.

భారతీయ జనతా పార్టీ ప్రధాన వాగ్దానాలు

1. భారతీయ జనతా పార్టీ “మహిళా సమ్మాన్ నిధి” కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుందని అమిత్ షా తెలిపారు. పేద మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

2. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కేంద్రం ప్రభుత్వ పథకం “ఆయుష్మాన్ భారత్” పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఆయుష్మాన్ యోజనలో రూ.5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం పొందే సదుపాయం ఉంది. ఆయుష్మాన్ తో పాటు మరో రూ.5 లక్షల వైద్య బీమాను అందజేస్తామని అమిత్ షా తెలిపారు.

3. ఢిల్లీలో వృద్ధులకు నెలకు రూ.2,000ల పెన్షన్‌ను రూ.2500లకు, వితంతువులకు నెలకు రూ.2500ల నుంచి రూ.3000లకు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది.

4. యమునా నదిని 3 సంవత్సరాలలో శుభ్రం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో యమునా నదిని శుభ్రం చేయడంతో పాటు అందంగా ముస్తాబు చేస్తామని అన్నారు. ప్రజలు యమునా నదిలో ఏమాత్రం సంకోచం లేకుండా స్నానం చేసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

5. ఢిల్లీలో మురికివాడల్లో నివసించేవారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పింది. ప్రభుత్వం రాగానే అనధికార కాలనీల్లో క్రయ, విక్రయాలకు అనుమతులు ఇస్తామని షా తెలిపారు. శరణార్థుల కోసం నిర్మించిన కాలనీల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు.

6. గర్భిణులకు రూ.21,000 ఆర్థిక సహాయం, 6 పోషకాహార కిట్లను అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అమిత్ షా ప్రకారం, మహిళలకు 6 నెలల ప్రసూతి సెలవులు కూడా ఇవ్వనున్నారు.

7. సీల్ చేసిన 13,000 షాపులను తిరిగి తెరిచేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. అమిత్ షా ప్రకారం, ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా దాని పరిష్కారం కనుగొంటామని చెప్పింది. ఢిల్లీలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ దుకాణాలను సీలు చేశారు.

8. ఢిల్లీలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఢిల్లీ వాసులకే ఈ ఉద్యోగాలు ఇస్తామని హోంమంత్రి షా చెప్పారు. 20 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తామని కూడా షా చెప్పారు.

9. 13,000 బస్సులను ఎలక్ట్రిక్-బస్సులుగా మారుస్తామని, ఢిల్లీకి 100 శాతం ఈ-బస్సు సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనివల్ల కాలుష్యం నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుందని బీజేపీ చెబుతోంది. తద్వారా ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర వాయు కాలుష్యం సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తోంది.

10. ఢిల్లీలోని టెక్స్‌టైల్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం రాగానే వారికి రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని అమిత్ షా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ 5 హామీలు

హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి కాంగ్రెస్ 5 హామీలను ప్రకటించింది.

1. ఢిల్లీ ప్రజలందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్.

2. సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్‌లు ఒక్కొక్కటి రూ.500.

3.బియ్యం, పంచదార, వంటనూనె, ధాన్యాలు, టీలతో కూడిన ప్రతి కుటుంబానికి ప్రతినెలా ఉచిత రేషన్ కిట్‌లు.

4. “ప్యారీ దీదీ యోజన” ద్వారా మహిళలకు నెలవారీ రూ.2,500 భృతిని కాంగ్రెస్ ప్రకటించింది.

5. ఢిల్లీ వాసులందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.

6. చదువుకున్న నిరుద్యోగ యువతకు నెలవారీ రూ.8,500 స్టైఫండ్ అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఉద్యోగాల కోసం వారిని స్థానిక పరిశ్రమల్లో కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా మొత్తం పోటీని ముక్కోణపు పోటీగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. AAP వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోకుండా నిరోధించాలనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తలపడుతున్నాయి. అయితే ఈ మూడు ప్రధాన పార్టీల హామీల్లో ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీ హామీలను విశ్వసిస్తారు.. ఎవరికి ఓటు వేస్తారన్నది ఉత్కంఠగా మారింది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ.. ఇలా వండారో గిన్నెలు ఊడ్చాల్సిందే

16 March 2026

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ.. ఇలా వండారో గిన్నెలు ఊడ్చాల్సిందే

16 March 2026

మటన్.. అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ఫుల్లుగా లాగించేస్తారు.. వాస్తవానికి మటన్‌ మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.. మేక మాంసం…

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ.. ఇలా వండారో గిన్నెలు ఊడ్చాల్సిందే

16 March 2026

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.