Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్‌! రెండో గెలుపు దక్కాలంటే..

13 July 2025

Goa Monsoon Places: గోవాలో ఈ ప్రదేశాలు స్వర్గధామాలు.. వర్షంకాలంలో పక్కాగా చూడాలి..

13 July 2025

Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ వేరే లెవెల్

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: వారం క్రితం ఫిర్యాదు చేశాడు.. నేడు పోలీసుల కాళ్ళకు మొక్కాడు..!
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: వారం క్రితం ఫిర్యాదు చేశాడు.. నేడు పోలీసుల కాళ్ళకు మొక్కాడు..!

.By .18 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: వారం క్రితం ఫిర్యాదు చేశాడు.. నేడు పోలీసుల కాళ్ళకు మొక్కాడు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వారం రోజుల క్రితం తన ఇంట్లో చోరీకి గురైందని పోలీసులను ఆశ్రయించాడు. 40 లక్షల రూపాయల విలువైన సొమ్ము పోయిందని లబోదిబోమన్నాడు. రోజులు చూపిన చొరవతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక దక్కదనుకున్న సొత్తు కళ్ల ముందు కనిపించడంతో పొంగిపోయాడు. ఏకంగా పోలీసుల కాళ్ల మీద పడిపోయాడు. చోరీ కేసుల్లో ఏళ్ళ తరబడి పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండని ఈ రోజుల్లో వారం రోజుల్లోనే తన 50 సవర్ల బంగారాన్ని రికవరీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్‌పి ఏఆర్‌ దామోదర్‌ కాళ్ళకు మొక్కి తన సంతోషాన్ని చాటుకున్నాడు…

అతడి వయస్సు 19 ఏళ్ళు.. చేసే పనులు చూస్తే బిత్తరపోవాల్సిందే..! అతడ్ని పట్టుకున్న పోలీసులకు అదే అనుభవం ఎదురైంది. ఒంగోలులో ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డ ఓ నిందితుడ్ని విచారిస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలులోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 40 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతరాష్ట్ర దొంగగా చలామణి అవుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల విలువైన సొత్తును దోచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

పట్టుబడింది ఇలా…

ఒంగోలులోని కమ్మపాలెం కాకతీయ నగర్ చెందిన గుమ్మడి నాగార్జునరావు ఆగస్ట్ 9వ తేదీ రాత్రి బంధువుల పెళ్లికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. తిరిగి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూస్తే, ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు. దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న 50 సవర్ల బంగారు నగలు, 1.80 లక్షల రూపాయల నగదు అపహరణంకు గురైనట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన ఇంట్లోనే చోరీ చేసి ఇంటి బయట ఉన్న తన హీరో హోండా బైక్‌పై పారిపోయాడని ఘోల్లుమన్నాడు.

బాధితుడు నాగార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు, చోరీకి గురైన మొత్తం సొమ్ము విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్‌పీ ఎఆర్‌ దామోదర్‌ నేతృత్వంలో క్రైం అడిషనల్‌ ఎస్‌పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్ట్ 16వ తేదీ ఒంగోలులోని సంతపేట దగ్గర ఓ లాడ్జిలో నిందితుడు ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. వెంటనే నిందితుడు పలివెల ప్రభు కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బండారం బయటపడింది. అంతేకాదు కూపీలాగితే గతంలో ఇతడు చేసిన నేరాల చిట్టా మొత్తం బయటపడింది.

జిల్లా ఎస్‌పీ కాళ్ళకు మొక్కిన బాధితుడు..

ఒంగోలులో పోలీసులకు పట్టుబడ్డ పలివెల ప్రభుకుమార్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్టు తేలింది. రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్, రాజానగరం పోలీస్ స్టేషన్, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్, తాడేపల్లి జిఆర్‌పి పోలీస్ స్టేషన్, విజయవాడ దగ్గరలోని తిరువూరు పోలీస్ స్టేషన్, హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్, నాచారం, దువ్వాడ పోలీస్ స్టేషన్, వైజాగ్ లోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్, నర్సీపట్నంలోని కోటగట్ల పోలీస్ స్టేషన్, అమలాపురం పోలీస్ స్టేషన్, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్, రాజోలు పోలీస్ స్టేషలలో మరో 25 కేసులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి దగ్గర నుంచి ఒంగోలులోని గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో చోరీ చేసిన 40 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే తన ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించి తన సొమ్మును రికవరీ చేసిన పోలీసులకు బాధితుడు నాగార్జునరావు చేతులెత్తి దండం పెట్టాడు. తన సొమ్ము తనకు దక్కేలా చేసిందుకు ఎస్‌పీ దామోదర్‌కు పాదాభివందనం చేశాడు.

ఇంటికి తాళం వేస్తే నగలు ఉంచొద్దు..

ప్రజలు శుభకార్యాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ఇళ్ళల్లో భారీగా బంగారం, నగదు ఉంచవద్దని ప్రకాశం జిల్లా ఎస్‌పీ ఏఆర్‌ దామోదర్‌ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ నగలను ఇంట్లోనే ఉంచినా సేఫ్‌ లాకర్లలో దాచుకోవాలని, వాటి తాళాలను ఇంట్లో ఉంచరాదని సూచించారు. ఇంట్లోని విలువైన బంగారు నగలు, నగదును బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఇళ్లల్లో దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్‌పీ దామోదర్ తెలిపారు. వీధుల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 ద్వారా తెలపాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలు జరుగకుండా నివారించవచ్చని సూచించారు. ఒంగోలులో ఇంట్లో జరిగిన కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్‌పీ ఏఆర్ దామోదర్ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డ్ లు అందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Bobbili Veena: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు.. ఓన్ డిస్ట్రిక్ట్ ఓన్ ప్రొడక్ట్‌గా ఎంపిక

13 July 2025

Chandrababu: ఈనెల 26న సింగపూర్‌కు చంద్రబాబు బృందం – ఎందుకో తెలుసా..?

13 July 2025

ఏపీలో భవనాలు కడుతున్నారా.? రూల్స్ మార్చిన ప్రభుత్వం..

13 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ENG: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్‌! రెండో గెలుపు దక్కాలంటే..

13 July 2025

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఒక విధంగా చెప్పాలంటే.. విజయానికి చాలా…

Goa Monsoon Places: గోవాలో ఈ ప్రదేశాలు స్వర్గధామాలు.. వర్షంకాలంలో పక్కాగా చూడాలి..

13 July 2025

Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ వేరే లెవెల్

13 July 2025

Bobbili Veena: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు.. ఓన్ డిస్ట్రిక్ట్ ఓన్ ప్రొడక్ట్‌గా ఎంపిక

13 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ENG: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్‌! రెండో గెలుపు దక్కాలంటే..

13 July 2025

Goa Monsoon Places: గోవాలో ఈ ప్రదేశాలు స్వర్గధామాలు.. వర్షంకాలంలో పక్కాగా చూడాలి..

13 July 2025

Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ వేరే లెవెల్

13 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.