Anakapalle Pharma Blast: అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అయి కొందరు.. శిథిలాల కిందపడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు..
ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. యజమాన్యాల అంతులేని నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. లేటెస్ట్గా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 18మంది కాలిబూడిదయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 300మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరు గాయపడ్డారు, ఎవరు చనిపోయారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..