AP Fibernet 500 Employees Terminated: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపులో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమితులైన దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. గతంలో ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ జీవీరెడ్డి రాజీనామా, ఎండీ బదిలీ తర్వాత ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. త్వరలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
హైలైట్:
- ఏపీలో మరోసారి ఉద్యోగుల తొలగింపు
- తాజాగా మరికొందర్ని తొలగిస్తూ నిర్ణయం
- ఈ నెలతో వారందరు కట్.. వివరాలివే

2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తక్కువ ధరకే కేబుల్, నెట్, ఫోన్ సేవలను అందించింది.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఎంతోమంది కనెక్షన్లు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ విషయంలో విమర్శలువచ్చాయి.. అలాగే ఏపీ ఫైబర్ నెట్ అప్పుల్లో కూరుకుపోయిందని కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఆరోపించాయి. అలాగే ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా తగ్గిపోయాయనే విమర్శలు వచ్చాయి.
అయితే గత ప్రభుత్వంలో నియమితులైన ఉద్యోగులు ఉండటంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వా తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వం అక్రమాలపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగులు ఆఫీసుకు కూడా వెళ్లకుండా జీతాలు తీసుకునేవారని విచారణలో తేలడంతో వారందరినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు, మూడుసార్లు పలువుర్ని తొలగించగా.. తాజాగా మరో 500 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ స్థానాల్లో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.
అలాగే ఇటీవల ఫైబర్ నెట్ సంస్థకు ఛైర్మన్గా ఉన్న జీవీరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవనీతి, ఉద్యోగుల నియామకాల విషయంలో సంస్థ ఎండీ తిరుపై జీవీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది.. దీంతో జీవీరెడ్డి రాజీనామా, ఆ సంస్థ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను బదిలీ చకచకా జరిగిపోయాయి.. ఆ తర్వాత ఆ సంస్థలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.