Andhra Pradesh Govt Plans Create New It Hub: విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడలో 1,080 ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు పనులకు ప్రయత్నించగా, కూటమి ప్రభుత్వం వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్లువాడ ప్రాంతంలో ఐటీ కంపెనీలను అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హైలైట్:
- ఏపీలో కొత్త ఐటీ హబ్ ఏర్పాటుకు అడుగులు
- 1080 ఎకరాల్లో భూమిని పరిశీలిస్తున్న సర్కార్
- ఈ మేరకు అధికారులు సర్వే కూడా చేస్తున్నారు

ఇందులో గతంలోనే ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు 9 ఎకరాలు, మోడల్ హైస్కూల్కు 7 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు ఇందులో 200 ఎకరాలను ఐటీ హబ్కు కేటాయించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. ఈ భూమిలో వంద ఎకరాలకు డి-పట్టాలు ఇచ్చినట్లు గుర్తించారు. అక్కడ రైతులు మామిడి, జీడిమామిడి సాగు చేస్తున్నారు. సర్వే చేసిన భూమిలో ఆక్రమణదారులు, డి-పట్టాదారుల వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత ఏపీఐఐసీకి అప్పగించి, ఐటీ హబ్కు కేటాయిస్తారు.
ఏపీలో కొత్తగా ఐటీ హబ్ ఏర్పాటు.. 1,080 ఎకరాల్లో అక్కడే ఫిక్స్, ఆ జిల్లాకు మహర్దశ
అలాగే ప్రస్తుతం ఐటీ హబ్కు ప్రైవేటు భూములు కూడా ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. దాదాపు 10-15 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఐటీ కంపెనీలను తర్లువాడ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మొత్తం మీద విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు విశాఖపట్నం మీదుగా వెళ్లే ఓ రైలును అధికారులు రద్దు చేశారు. ఈనెల 30, మే 1, 3, 4, 6 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.