Andhra Pradesh Ration Card Holders EKYC April 30th Last Date: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. లేదంటే రేషన్తో పాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గడువు మరోసారి పొడిగించే అవకాశం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవడానికి రేషన్ షాపులు, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ ఆపరేటర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయాల్లో ఈ సదుపాయం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్కార్డుల్లో పేర్లు ఉన్న ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంది.. మిగిలినవారు కచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈకేవైసీ చేయడానికి గడువు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించవచ్చు అంటున్నారు.
గతంలో చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నవాళ్లు, అలాగే పరీక్షల వల్ల ఈకేవైసీ చేసుకోలేకపోయారు. వాస్తవానికి మార్చి 31న గడువు ముగియగా.. ప్రజల ఇబ్బందుల్ని గమనించి ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఇటీవల చాలా మంది రేషన్ కార్డుదారులు చనిపోయారు.. వారి పేర్లను ఇంకా తొలగించలేదు. చాలా మంది చిరునామాలు కూడా మారిపోయాయి.. అందుకే ఈకేవైసీ తప్పనిసరి చేశారు. అడ్రస్ మారినప్పటికీ, రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడే ఈకేవైసీ చేయించుకోవచ్చు అంటున్నారు అధికారులు.
ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి రెండ్రోజులే గడువు.. ఇలా చేయకపోతే రేషన్ కట్, ప్రభుత్వ పథకాలు రావు
ఈ పాస్ యంత్రాల్లో పెండింగ్ ఉంటే, సంబంధిత వ్యక్తిని పిలిచి ఇప్పటికే ఈ కేవైసీకి సంబంధించిన వేలిముద్రలు వేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవారు, విదేశాల్లో చదువుకుంటున్నవారికి కూడా అవకాశం ఇచ్చారు. 2020లో కార్డులు పొందిన వారి పిల్లలకు ఇప్పుడు పదేళ్లు ఉంటాయి కాబట్టి వారంతా ఆధార్ బయోమెట్రిక్ చేసుకోవాలి అని సూచిస్తుననారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు అధికారుల. మరో రెండు రోజులే గడువు ఉంది కాబట్టి ఈ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మరోసారి ఈకేవైసీకి గడువు ఇవ్వరని.. ఈ రెండు రోజులే (ఏప్రిల్ 30 లోగా) ఛాన్స్ ఉంటుందని గుర్తు చేస్తున్నారు.