
ఒడిశాలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు దళితులపై అమానుషంగా వ్యవహరించారు. గంజాం జిల్లా ధారాకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం నాడు హరిపూర్ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి ఒక ఆవు, రెండు దూడలను కొనుగోలు చేశారు. వాటిని నడుపుకుంటూ తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వారిని ఖారిగుమ్మ వద్ద ఏడుగురు వ్యక్తులు వారిని అడ్డుకుని దాడి చేశారు. అలాగే బాధితుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారు.
అనంతరం అరగుండ్లు కొట్టించి, మురుగు కాలువలోని నీటిని బలవంతంగా తాగించి, మోకాళ్లపై నడిపించారు. బాధితులు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. బాధితులకు తల, వీపుపై గాయాలు ఉండటంతో పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..