
విజయవాడను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా.. అక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం అక్కడ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది.. ఈ మేరకు నష్టంపై కేంద్రానికి మధ్యంతర నివేదికను పంపించారు. అయితే విజయవాడకు కేంద్రం బిగ్ బూస్టప్ ఇచ్చింది. విజయవాడ దేశంలో 9వ ర్యాంకును సాధించింది. సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2024లో 10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో విజయవాడకు 9వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నగరాల్లో బయోమాస్, రోడ్లపై దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి వెలువడే ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగలు, ప్రజా చైతన్యం, గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల సంఖ్య ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా పది లక్షలకు పైబడి జనాభా ఉన్న 47 నగరాల్లో పని తీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించారు. ఇందులో విజయవాడ 182 మార్కులతో 9వ స్థానాన్ని దక్కించుకోగా.. విశాఖపట్నం 163 మార్కులతో 26వ స్థానానికి పరిమితమైంది. ఈ రెండు నగరాలు మెరుగైన ర్యాంకులు సాధించాయి.
ఏపీలో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న 43 నగరాల్లో గుంటూరు 185 మార్కులతో 10వ స్థానం, రాజమండ్రి 178 మార్కులతో 17వ స్థానం, నెల్లూరు 171.5 మార్కులతో 19వ స్థానం.. కర్నూలు 163.5 మార్కులతో 23, కడప 161.7 మార్కులతో 25, అనంతపురం 149.3 మార్కులతో 33వ స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు 3 లక్షల లోపు జనాభా ఉన్న 40 పట్టణాల్లో ఒంగోలు 170 మార్కులతో 17వ స్థానం, చిత్తూరు 153.9 మార్కులతో 21, శ్రీకాకుళం 153.4 మార్కులతో 22, విజయనగరం 146.5 మార్కులతో 24 వ స్థానాల్లో నిలిచాయి.
ఏపీలో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న 43 నగరాల్లో గుంటూరు 185 మార్కులతో 10వ స్థానం, రాజమండ్రి 178 మార్కులతో 17వ స్థానం, నెల్లూరు 171.5 మార్కులతో 19వ స్థానం.. కర్నూలు 163.5 మార్కులతో 23, కడప 161.7 మార్కులతో 25, అనంతపురం 149.3 మార్కులతో 33వ స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు 3 లక్షల లోపు జనాభా ఉన్న 40 పట్టణాల్లో ఒంగోలు 170 మార్కులతో 17వ స్థానం, చిత్తూరు 153.9 మార్కులతో 21, శ్రీకాకుళం 153.4 మార్కులతో 22, విజయనగరం 146.5 మార్కులతో 24 వ స్థానాల్లో నిలిచాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకుల్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 10లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లో సూరత్ (గుజరాత్), జబల్పుర్ (మధ్యప్రదేశ్), ఆగ్రా (ఉత్తర్ప్రదేశ్)లు తొలి మూడు స్థానాలలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్ (ఉత్తర్ప్రదేశ్), అమరావతి (మహారాష్ట్ర), ఝాన్సీ (ఉత్తర్ప్రదేశ్).. అలాగే 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్బరేలి (ఉత్తర్ప్రదేశ్), నల్గొండ (తెలంగాణ), నలాగఢ్ (హిమాచల్ప్రదేశ్)లు తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి. అయితే ఈ నగరాలు రూ.1.50 కోట్ల నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు బహుమతులను అందిస్తారు.

