Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?

13 March 2026

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Launches Midday Meals For Day Scholars,టీటీడీ మరో శుభవార్త.. ఆ విద్యార్థినులకు పూర్తిగా ఉచితం, ప్రతి రోజూ ఉంటుంది – ttd launched mid day meals scheme for tirupati sri padmavathi womens junior college day scholars
ఆంధ్రప్రదేశ్

Ttd Launches Midday Meals For Day Scholars,టీటీడీ మరో శుభవార్త.. ఆ విద్యార్థినులకు పూర్తిగా ఉచితం, ప్రతి రోజూ ఉంటుంది – ttd launched mid day meals scheme for tirupati sri padmavathi womens junior college day scholars

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Launches Midday Meals For Day Scholars,టీటీడీ మరో శుభవార్త.. ఆ విద్యార్థినులకు పూర్తిగా ఉచితం, ప్రతి రోజూ ఉంటుంది – ttd launched mid day meals scheme for tirupati sri padmavathi womens junior college day scholars
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Launches Midday Meals For Tirupati Womens College: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజీ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విద్యార్థినులకు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకుని చదువుకోవాలని సూచించారు. డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి, బంగారు భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ విద్య పునాది అని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి.

హైలైట్:

  • తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ
  • టీటీడీ మధ్యాహ్న భోజనం ప్రారంభించారు
  • డే స్కాలర్స్‌కు ఉచితంగా భోజనం అందిస్తారు
TTD Midday Meals
(ఫోటోలు– Samayam Telugu)
తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎస్ శాంతారామ్, నరేష్ కుమార్, డీఈవో వేంకట సునీల్ పాల్గొన్నారు. కాలేజీలో డే స్కాలర్స్‌కి మధ్యాహ్న భోజన పథకాన్ని బీఆర్ నాయుడు ప్రారంభించారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారని.. కనుక పట్టుదలతో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ‘ఇంటర్మీడియట్ విద్య బంగారు భవిష్యత్తుకు పునాది వేసే సదవకాశం. ఈ దశలో మీరు వేసే ప్రతి ప్రయత్నం, తీసుకునే ప్రతి నిర్ణయం జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా నిరాశపడకుండా కష్టంతో టీటీడీ ఛైర్మన్ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, అవి సాధించే వరకు ప్రయత్నం ఆపకూడదు. ఇంతటి పోటీ ప్రపంచంలో పద్మావతి జూనియర్ కళాశాల గత సంవత్సరం పరీక్షల ఫలితాల్లో 97 శాతం రాణించడం అభినందించదగ్గ విషయం. ఈసారి 100శాతం ఫలితాలు సాధించి టీటీడీ సంస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. డే స్కాలర్స్‌కి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

అనంతరం క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థినులను టీటీడీ ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డేస్కాలర్స్ విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రారంభించి వారితోపాటు కలిసి భోజనం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కు కల్పించిన సదుపాయం ద్వారా 436 మంది విద్యార్థినులకు లబ్ది చేకూరుతుంది. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి భువనేశ్వరి కళాశాల సమగ్ర నివేదికను నివేదించారు. గతేడాది పరీక్షల ఫలితాలలో సమిష్టి కృషితో 97 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల వార్షికోత్సవ ప్రారంభంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

శ్రీ త్యాగరాజస్వామి వారి 179వ ఆరాధన ఉత్సవం

టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీక నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 179వ ఆరాధన ఉత్సవం జరుగుతోంది. శ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆవరణంలోని ఓపెన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 7.30 గం.ల నుండి జనవరి 08వ తేదీ ఉదయం 8 గం.ల వరకు 24 గంటల పాటు అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 7.30 గం.లకు నాదస్వర డోలు కచేరీ అనంతరం శ్రీ త్యాగరాజస్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమం, ఘనరాగ పంచరత్న కీర్తనల బృందగానం నగరంలోని సంగీత విద్వాంసులు కళాశాల అధ్యాపక బృందం సంయుక్తంగా నిర్వహించారు. అనంతరం సంగీత విద్వాంసులు, సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కళాశాల మరియు నాదస్వర డోలు పాఠశాలలోని అధ్యాపక ఉపాధ్యాయ బృందం వారికి కేటాయించిన సమయానికి గాత్ర , వాద్య సంగీత కచేరీలు ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉదయం 8.50 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ త్యాగరాజ విరచిత ఘనరాగ పంచరత్న కృతులు బృందగానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

24 గంటల అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం గురువారం ఉదయం 7:30 గంటలకు వరకు నిర్వహించి, అనంతరం శ్రీ ఆంజనేయ ఉత్సవం మరియు మహా మంగళహారతి కార్యక్రమంతో పరిసమాప్తి అవుతుందని ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఉమా ముద్దుబాల తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి