Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

SRH Captain: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆ రోజే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!

14 April 2026

Airtel Plans: ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌.. డేటా, కాల్స్‌ మరెన్నో బెనిఫిట్స్‌!

14 April 2026

Gold Price: యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల అంచనాలివే..!

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Janasena Mla Vamsi Krishna Srinivas,వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.! – criticism on janasena mla vamsi krishna srinivas for returning the memorandum to citu leaders
ఆంధ్రప్రదేశ్

Janasena Mla Vamsi Krishna Srinivas,వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.! – criticism on janasena mla vamsi krishna srinivas for returning the memorandum to citu leaders

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Janasena Mla Vamsi Krishna Srinivas,వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.! – criticism on janasena mla vamsi krishna srinivas for returning the memorandum to citu leaders
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఐటీయూ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే.. వెనువెంటనే వారికే ఇచ్చేయటం, ఈ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

Janasena MLA Vamsi Krishna Srinivas memorandum
సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ(ఫోటోలు– Samayam Telugu)
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన సీఐటీయూ నేతలపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసుగా ప్రవర్తించారని విమర్శలు వస్తున్నాయి. విశాఖ నైట్ ఫుడ్ కోర్ట్ తెరిపించాలని కోరుతూ బాధితులు గత కొన్నిరోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ ఫుడ్ కోర్టు వ్యవహారంపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌కు సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. వారి నుంచి వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యను తెలుసుకున్నారు. అనంతరం వెంటనే ఆ వినతిపత్రాన్ని వారికి తిరిగి ఇచ్చేశారు వంశీకృష్ణ. వినతిపత్రాన్ని విసిరివేసినట్లుగా వెనక్కి ఇచ్చేయటంపై సీఐటీయూ నేతలు మండిపడుతున్నారు.

మరోవైపు వినతిపత్రాన్ని వెనక్కి ఇచ్చేసి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి వారితో ఏదో మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా కాస్త ఓపికతో వ్యవహరించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమస్యను విన్న తర్వాత వినతిపత్రాన్ని తన వ్యక్తిగత సిబ్బందికి అందించాల్సింది పోయి బాధితులకే విసిరికొడతారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్టును గతేడాది సెప్టెంబర్ నెలలో అధికారులు తొలగించారు. జేసీబీల సాయంతో దుకాణాలను తొలగించారు. వాస్తవానికి 2019లో 32 దుకాణాలకు వ్యాపారాలు చేసుకునేందుకు అప్పటి అధికారులు అనుమతి ఇచ్చారు. నైట్ ఫుడ్ స్ట్రీట్లలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా సమయంలో నైట్ ఫుడ్ కోర్టు మూతపడింది. 2021 చివరిలో తిరిగి ప్రారంభించారు. అయితే నైట్ ఫుడ్ కోర్టును కొంతమంది తమ చేతులలోకి తీసుకుని.. అక్రమంగా దందాలు చేస్తున్నారని జీవీఎంసీ దీనిని తొలగించాలని నిర్ణయించింది. ఫుడ్ కోర్టు తొలగించి అర్హులైన వారికే వ్యాపారానికి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ నెలలో నైట్ ఫుడ్ కోర్టు తొలగించారు.

అయితే నైట్ ఫుడ్ కోర్టును తొలగించారే కానీ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గతంలో సమ్మె కూడా చేపట్టారు. గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఫుడ్ కోర్టు లేక, వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారికి సంఘీభావంగా తెలిపిన సీఐటీయూ నేతలు.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించేందుకు వస్తే ఈ ఘటన చోటుచేసుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి