Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: రూ.కోటి విలువైన పాన్‌ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..

15 April 2026

ఇరాన్ మైండ్ గేమ్‌తో బొక్క బోర్లాపడ్డ అమెరికా.. 10 వేల మంది సైనికులున్నా ఆగని నౌకలు!

15 April 2026

మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!! | YSRCP announces support for Modi’s govt move for Delimitation as 2011 census & Women’s reservation bill

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kadiri Gas Cylinder Blast In A House,కదిరిలో ఘోర ప్రమాదం.. ఓ ఇంట్లో పేలుడు, నలుగురు మృతి.. 10మందికిపైగా తీవ్ర గాయాలు – gas cylinder blast in a house at kadiri sri sathya sai district
ఆంధ్రప్రదేశ్

Kadiri Gas Cylinder Blast In A House,కదిరిలో ఘోర ప్రమాదం.. ఓ ఇంట్లో పేలుడు, నలుగురు మృతి.. 10మందికిపైగా తీవ్ర గాయాలు – gas cylinder blast in a house at kadiri sri sathya sai district

.By .15 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kadiri Gas Cylinder Blast In A House,కదిరిలో ఘోర ప్రమాదం.. ఓ ఇంట్లో పేలుడు, నలుగురు మృతి.. 10మందికిపైగా తీవ్ర గాయాలు – gas cylinder blast in a house at kadiri sri sathya sai district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kadiri Gas Cylinder Blast: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 10మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల జరిగిందా లేదా జిలిటిన్‌ స్టిక్స్‌ వల్ల జరిగిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

హైలైట్:

  • శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఘోర ప్రమాదం
  • ఓ ఇంట్ల ోపేలుడు.. అక్కడే నలుగురు మృతి
  • పేలుడుకు కారణాలపై ఆరా తీస్తున్నారు
Kadiri Blast
కదిరిలో గ్యాస్ సిలిండర్ పేలుడు(ఫోటోలు– Samayam Telugu)
సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరో పదిమందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చనిపోయినవారిని మహబూబున్ని(40), మధు(36), సంపత్ (30)
వెంకన్న (45)గా గుర్తించారు.ఈ పేలుడు దెబ్బకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.. ఆ పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు అక్కడ పరిస్థితులు చూస్తే అర్ధమవుతోంది.. కానీ ఈ పేలుడుకు జిలిటిన్ స్టిక్స్ కారణమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చేందుకు ఉపయోగించే డ్రిల్లింగ్ మెషిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి