Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సుర్రుమనే సమ్మర్ నుంచి ఇట్టే రిలీఫ్.. రోజుకో గ్లాస్ తాగితే బాడీ కూల్ కూల్

26 April 2026

Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 15 ఇన్నింగ్స్‌లు.. 50 సిక్సర్లు.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

26 April 2026

శ్రీవారినిజీవితంలో ఒక్కసారైనా..ఇలా చూశారా?

26 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tdp Ashok Babu On K Venkatrami Reddy Dismiss,వెంకట్రామిరెడ్డి భార్యకు ముషీరాబాద్ టికెట్ అడగలేదా.. జగన్‌కు అశోక్‌బాబు కౌంటర్.. – tdp leader ashok babu counter to ys jagan over ap secretariat employees association ex president venkatrami reddy dismiss
ఆంధ్రప్రదేశ్

Tdp Ashok Babu On K Venkatrami Reddy Dismiss,వెంకట్రామిరెడ్డి భార్యకు ముషీరాబాద్ టికెట్ అడగలేదా.. జగన్‌కు అశోక్‌బాబు కౌంటర్.. – tdp leader ashok babu counter to ys jagan over ap secretariat employees association ex president venkatrami reddy dismiss

.By .22 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tdp Ashok Babu On K Venkatrami Reddy Dismiss,వెంకట్రామిరెడ్డి భార్యకు ముషీరాబాద్ టికెట్ అడగలేదా.. జగన్‌కు అశోక్‌బాబు కౌంటర్.. – tdp leader ashok babu counter to ys jagan over ap secretariat employees association ex president venkatrami reddy dismiss
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత కె. వెంకట్రామిరెడ్డి డిస్మిస్ వ్యవహారం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఏం తప్పు చేశారని డిస్మిస్ చేశారని నిలదీశారు. అశోక్ బాబుకు ఓ రూల్.. వెంకట్రామిరెడ్డికి మరో రూల్ ఉంటుందా అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి డిస్మిస్ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ బాబు స్పందించారు.

హైలైట్:

  • సచివాలయ ఉద్యోగుల నేత వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌ అంశంపై అశోక్ బాబు రియాక్షన్
  • వైఎస్ జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
  • వెంకట్రామిరెడ్డి భార్యకు గతంలో ముషీరాబాద్ టికెట్ అడిగారని ఆరోపణలు
TDP Ashok babu on K Venkatrami Reddy Dismiss
వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై అశోక్ బాబు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేయటం.. అధికార, విపక్షాల మధ్యన మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కాండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారనే కారణంతో ఏపీ ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేసింది. ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలుపుదల చేసింది. దీనిపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను లేవనెత్తడమే వెంకట్రామిరెడ్డి చేసిన నేరమా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశో‌క్ బాబు.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌కు కౌంటరిచ్చారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ బాబు. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అశోక్‌ బాబు తెలిపారు. 2024లో కాకర్ల వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసినప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని అశోక్ బాబు తెలిపారు. అప్పటి నుంచే వెంకట్రామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయన్న ఆయన.. 2024 ఎన్నికలలో వెంకట్రామిరెడ్డి వైసీపీ తరుఫున ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంకట్రామిరెడ్డి మీద అప్పట్లోనే నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. ఆగస్టులో జరిగిన విచారణలో వెంకట్రామిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతోనే డిస్మిస్ చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.

కాకర్ల వెంకట్రామిరెడ్డి కుటుంబమంతా వైసీపీ కార్యకర్తలేనన్న అశోక్ బాబు.. వెంకట్రామిరెడ్డి భార్య ముషీరాబాద్ టికెట్ అడగటం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని.. ఎల్వీ సుబ్రమణ్యం, ఏబీ వెంకటేశ్వరరావు వంటి ఆఫీసర్లను వేధించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత వైసీపీది, వైఎస్ జగన్‌‍ది అంటూ అశోక్ బాబు మండిపడ్డారు. కూటమి సర్కారు నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తోందని.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అశోక్ బాబు స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి