Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!

1 May 2026

Andhra Pradesh Get Rs 1216 Crores From Union Govt,ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు.. రెండు రోజుల్లో వరుసగా భారీగా నిధులు విడుదల – union government released another rs 1216 crores to andhra pradesh

1 May 2026

UGC NET 2026 Registration: యూజీసీ నెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు షురూ.. రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Miyazaki Mango Cultivated In Andhra Pradesh,ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు – japan miyazaki mango kg worth rs 2.70 lakhs cultivated in hanuman junction krishna district in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Miyazaki Mango Cultivated In Andhra Pradesh,ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు – japan miyazaki mango kg worth rs 2.70 lakhs cultivated in hanuman junction krishna district in andhra pradesh

.By .30 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Miyazaki Mango Cultivated In Andhra Pradesh,ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు – japan miyazaki mango kg worth rs 2.70 lakhs cultivated in hanuman junction krishna district in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జపాన్‌లో పండే అరుదైన రకం మామిడి పండ్లు ఇప్పుడు ఏపీలో కూడా పండుతున్నాయి. మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలు పలికే ఈ మామిడి పండ్లను ఇప్పుడు ఏపీలోని ఓ బిజినెస్‌మెన్ పండిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా.. ఈ అరుదైన రకం మామిడి చెట్టును తన ఇంట్లో పెంచుతున్నారు. ఇంతకీ ఆ అరుదైన మామిడి స్పెషాలిటీ ఏంటి. దానికి ఎందుకు అంత ధర. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హైలైట్:

  • ఏపీలో పండుతున్న జపాన్ మియాజాకీ మామిడి
  • అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.2.70 లక్షలు
  • టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంట్లో చెట్టు
Miyazaki Mango
ఏపీలో పండుతున్న జపాన్ మామిడి(ఫోటోలు– Samayam Telugu)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా.. జపాన్‌కు చెందిన మియాజాకి మామిడి పండ్లను చెబుతారు. జపాన్‌లో పండించే ఈ మియాజాకీ మామిడి పండ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.2.70 లక్షల వరకు ఉంటుంది. ముదురు ఎరుపు, పర్పుల్ రంగులో ఉండే ఈ మియాజాకీ మామిడి పండు.. చాలా తీయగా, అస్సలు గుజ్జు లేకుండా ఉంటుంది. జెల్లీ లాంటి గుజ్జు కలిగి ఉండి.. 15 శాతానికి పైగా షుగర్ లెవల్స్‌తో.. తింటే అమృతం లాగా ఉంటుంది. ఈ మియాజాకీ మామిడి పండును.. తాయో నో తమగో అని.. ఎగ్ ఆఫ్ ద సన్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ జపాన్ రకం మియాజాకీ మామిడి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పండిస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో పుట్టిగుంట సతీష్ కుమార్ బిజినెస్‌మెన్ తన ఫాంహౌస్‌లో ఈ మియాజాకీ మామిడి పంటను పండిస్తున్నారు. పంట పండించడమే కాకుండా మంచి దిగుబడిని కూడా సాధిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 100 మామిడిపండ్లను కోసినట్లు వెల్లడించారు. ఈ మియాజాకీ మామిడి పండ్ల గురించి తాను యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నట్లు సతీష్ కుమార్ చెప్పారు. జపాన్‌‍లో పుట్టినప్పటికీ.. దీన్ని చాలా దేశాల్లో పండిస్తున్నారని పేర్కొన్నారు. తన స్నేహితుడు థాయ్‌లాండ్ నుంచి ఒక 10 మియాజాకీ మొక్కలను తెప్పించి తనకు ఇచ్చారని తెలిపారు.

ఆ 10 మొక్కల్లో కొన్ని ఫాంహౌస్‌లో మరికొన్ని తన ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టినట్లు చెప్పారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వయసు ఉన్న మొక్కను తెచ్చి పెట్టామని.. ఇప్పుడు అన్నీ కాపు కాశాయని పేర్కొన్నారు. ఇవి సాధారణ మామిడి పండ్లలా కాకుండా చాలా భిన్నమైన రుచి కలిగి ఉన్నాయని తెలిపారు. తన ఫాంహౌస్‌లో 3 మియాజాకీ మామిడి చెట్లను పెంచగా.. మొత్తం కలిపి 100 మామిడికాయలు వచ్చినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒక రైతు ఈ మియాజాకీ మామిడి పండ్లను సాగు చేసి.. ఒక్కో మామిడిపండును రూ.10 వేలకు విక్రయించారు. తిరుపతి, కడప రైతులు కూడా వీటిని పండించేందుకు రెడీ అవుతున్నారు.

అదే సమయంలో విజయవాడ నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు.. తన ఇంట్లో కూడా ఈ మియాజాకీ మామిడి చెట్టును పెంచుతుండటం విశేషం. ఈ మియాజాకీ మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సాధారణంగా మామిడి పండ్లు కిలోకు రూ.150 నుంచి మొదలవుతాయి. కానీ ఈ మియాజాకీ మామిడి పండ్లు కిలోకు ఏకంగా అక్షరాలా రూ.2.70 లక్షలు కావడంతో సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. జపాన్‌లో ఈ మియాజాకీ మామిడి పండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి వేలం పాట వేసి విక్రయిస్తారు. ఈ మియాజాకీ మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటు విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు, సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు.

శివరామచారి తాటికొండ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ న్యూస్ ఛానెల్‌లో కాపీ ఎడిటర్‌గా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ స్పోర్ట్స్ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి