Ys Jagan Culpable Homicide Section: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో జగన్ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినా, వీడియో ఫుటేజీల ఆధారంగా హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అసలేం జరిగింది? జగన్ ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు?
హైలైట్:
- సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ పేరు
- గుంటూరు జిల్లా ఎస్పీ కీలక విషయాలు వెల్లడి
- ఈ కేసులో కల్పబుల్ హోమీసైడ్ కూడా నమోదు

ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘18.06.2025న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమానికి, మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్, తాడేపల్లి నుంmr సత్తెనపల్లికి 3 కార్లకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది. నల్లపాడు పీఎస్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు కాన్వాయ్ చేరుకున్నప్పుడు.. రోడ్డు ప్రమాదం జరిగిందని, అందులో ఒక వ్యక్తి రక్తస్రావంతో గాయపడ్డాడని సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన చీలి సింగయ్య అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు మరియు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మరియు అతని భార్య చీలి లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేయబడింది’ అన్నారు.
వైఎస్ జగన్పై కేసు.. కల్పబుల్ హోమీసైడ్ గురించి తెలుసా, ఈ సెక్షన్ చాలా పవుర్ ఫుల్?
‘ఈ ఘటనకు సంబంధించి పలు వీడియొ ఫూటేజీలు, సీసీ ఫూటేజీలు, డ్రోన్ వీడియోలు, అక్కడకు వచ్చిన ప్రత్యేక్ష సాక్షులను విచారించి, దీనికి సంబంధించి పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్ష్యాలను సేకరించి, ఆ ప్రదేశంలో లభించిన ఇతర ఆధారాలను పరిశీలించి, సదరు నేరమునకు వర్తించే సెక్షన్లు ను 105 మరియు 49 BNS లకు మార్చుట జరుగును. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన..
1) రమణా రెడ్డి (కారు డ్రైవర్)
2) వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు (మాజీ ముఖ్యమంత్రి)
3) కె. నాగేశ్వర్ రెడ్డి (పీఏ)
4) వైవీ సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
5) పేర్ని నాని (మాజీ ఎమ్మెల్యే)
6) విడదల రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తదనంతరం, పై వారి పేర్లను నిందితుల గా పేర్కొని, వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాము’ అంటూ మీడియాకు తెలిపారు.