Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: కొలిక్కి వచ్చిన రాజ్యసభ అభ్యర్థులు ఎంపిక.. నామినేషన్ వేయనున్న ఆ ఇద్దరు నేతలు!

5 March 2026

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

5 March 2026

APSRTC Free Bus Travel For 10th Class Students From March 16,పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే, ఈ ప్రూఫ్ తప్పనిసరి – apsrtc provides free bus travel facility to 10th class students from march 16th 2026 in andhra pradesh

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati First Republic Day Celebrations,అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు – ap capital amaravati gears up for first grand republic day celebration
ఆంధ్రప్రదేశ్

Amaravati First Republic Day Celebrations,అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు – ap capital amaravati gears up for first grand republic day celebration

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati First Republic Day Celebrations,అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు – ap capital amaravati gears up for first grand republic day celebration
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు పది ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో పది ఎకరాల్లో పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, 500 మంది ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైలైట్:

  • అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు
  • ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారుల
  • పది వేల మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా
Amaravati first Republic Day celebrations
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి తొలి గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. రాజధానిలో తొలిసారి ఈ జాతీయ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వేడుకల నిర్వహణ కోసం రాజధాని పరిపాలన నగరంలోని మంత్రుల నివాస సముదాయాలకు ఎదురుగా.. పది ఏకరాల్లో పరేడ్‌గ్రౌండ్‌‌ను సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ తొలి గణతంత్ర వేడుకలకు పరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధం చేసే బాధ్యలతను ఏపీసీఆర్డీఏకి అప్పగించింది కూటమి ప్రభుత్వం.కాగా, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం విజయవాడలో నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం. కానీ ఇకపై వీటిని నూతన రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 77వ గణతంత్ర వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రిపబ్లిక్ డే రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

అమరావతిలో ఈసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్‌, మంత్రులు సహా దాదాపు 500 మంది ప్రముఖులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరే కాకుండా రాజదానిలో తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తున్నందున.. వాటిని వీక్షించేందుకు రాజధాని గ్రామాల నుంచి, గుంటూరు, విజయవాడ నుంచి దాదాపు 10 వేల మంది వరకు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా పలు శకటాలు కూడా ప్రదర్శించనున్నారు. ఇందులో ఆకట్టుకున్న మూడు శకటాలకు బహుమతులు అందజేస్తారు

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై ఏపీ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ వివిధ శాఖల అధికారులతో జనవరి 7న రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వేడుకలు జరిగే పరేడ్ గ్రౌండ్‌లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం వంతి తదితర ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. కాగా, రాజధానిలో తొలి గణతంత్ర వేడుకల కోసం వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లను.. అధికారులు ప్రధాన కార్యదర్శికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి