Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Annaprasadam,శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం.. ఆ సంస్థతో టీటీడీ ఒప్పందం.. – ttd signed mou with tvs motor company to manufacture tirumala annaprasadam using machinery
ఆంధ్రప్రదేశ్

Tirumala Annaprasadam,శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం.. ఆ సంస్థతో టీటీడీ ఒప్పందం.. – ttd signed mou with tvs motor company to manufacture tirumala annaprasadam using machinery

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Annaprasadam,శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం.. ఆ సంస్థతో టీటీడీ ఒప్పందం.. – ttd signed mou with tvs motor company to manufacture tirumala annaprasadam using machinery
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


టీటీడీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు జరిగాయి. టీటీడీ ఈవో శ్యామలరావు జెండా ఎగురవేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం టీటీడీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమల అభివృద్ధికి విజన్ -2047 తయారుచేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ విజన్ రూపొందిస్తున్నట్లు వివరించారు.

Samayam Teluguశ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం.. ఆ సంస్థతో టీటీడీ ఒప్పందం..
శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత రుచిగా అన్నప్రసాదం.. ఆ సంస్థతో టీటీడీ ఒప్పందం..

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. వేడుకల్లో భాగంగా టీటీడీ భద్రతా సిబ్బంది కవాతు చేశారు. అనంతరం టీటీడీలో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులు, ఎస్వీబీసీలోని 7 మంది ఉద్యోగులను టీటీడీ సత్కరించింది. వారికి 5 గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం టీటీడీ ఉద్యోగులను ఉద్దేశించి, టీటీడీ ఈవో శ్యామలరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుమలలో టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని, వారిని టీటీడీ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్నామని, మరింత రుచికరంగా అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేలా టివిఎస్‌ మోటార్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే ముడిసరుకుల ఎంపికలో సూచనల కోసం రిలయన్స్‌ రిటైల్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని జనతా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా దేశంలోని ప్రముఖ సంస్థలకు, క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సులు జారీ చేయనున్నట్లు చెప్పారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచిగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కొనుగోలు చేస్తున్నామని.. నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో గుర్తించేలా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ ల్యాబ్ కోసం నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు రూ.70 లక్షలు విలువ చేసే రెండు యంత్రాలను విరాళంగా ఇచ్చిందని వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి వంటి సేవల బుకింగ్‌లో లోపాలు చక్కదిద్దేందుకు ఐటీ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు సుమారుగా 7 లక్షల మంది భక్తులకు ద్వార దర్శనాలు కల్పించామని తెలిపారు.

మరోవైపు తిరుమల అభివృద్ధికి విజన్ – 2047 తయారు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. సీఎం సూచనల మేరకు అలిపిరి బేస్ క్యాంప్, మల్టీలెవల్ పార్కింగ్‌, స్మార్ట్‌ పార్కింగ్‌ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన లింక్‌ రోడ్డులు, సబ్‌ వేల నిర్మాణం, రామ్‌ భగీచ, బాలాజీ బస్టాండ్‌, పాత సత్రాలను పునర్నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hanuman Jayanti Tirumala,తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. – ttd special arrangements for hanuman jayanti on may 12 in tirumala

1 May 2026

Sudheer Reddy Reward For 10th Students,పదో తరగతి టాపర్లకు స్థలం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంపరాఫర్ – srikalahasti mla sudheer reddy announced cash and plots as reward for the tenth class exams topper students

1 May 2026

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు…

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ.. ” గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ” ఎక్కడో తెలుసా? | Kumbhalgarh Fort wall which is known as great wall of india history and full details about fort also

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.