Kakinada Sudheer Amazing Car: ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధీర్ అనే యువకుడు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేకంగా ఒక జీపును తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ జీపు ప్రత్యేకత ఏమిటంటే ప్రయాణికుల సంఖ్యను బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే అవకాశం ఉంది. బెంగళూరు ట్రాఫిక్ కష్టాల నుండి వచ్చిన ఆలోచనతో, హైడ్రాలిక్స్తో ఈ వాహనాన్ని రూపొందించాడు. బ్యాటరీతో నడిచే ఈ జీపు తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయింది. ప్రోత్సాహం లభిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు సుధీర్.
హైలైట్:
- కాకినాడ కుర్రాడి క్రియేటవిటీ
- రూ.2.5 లక్షలకే జీపు తయారీ
- మనోడి టాలెంట్పై ప్రశంసలు

కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్కు హ్యాట్సాప్
ఒక బటన్ నొక్కగానే జీపు వెడల్పుగా మారుతుందంటున్నారు. ఈ వాహనం తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయిందని.. రాబోయే రోజుల్లో దీనిని రూ.1.80 లక్షలకు తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సుధీర్ అంటున్నారు. తనకు ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తానంటున్నారు. సుధీర్ తయారు చేసిన ఈ వాహనం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సుధీర్ తయారు చేసిన ఈ వాహనం గ్రామీణీ ప్రాంతాలతో పాటుగా పట్టణం, నగరాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తుందని.. చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద సుధీర్ టాలెంట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.