Pedana Lakshmipuram National Highway: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 216హెచ్ జాతీయ రహదారికి మోక్షం కలిగింది. పెడన-లక్ష్మీపురం మధ్య 120.85 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని రూ.4245 కోట్లతో విస్తరించనున్నారు. ఈ హైవే గుడివాడ, హనుమాన్జంక్షన్, నూజివీడు మీదుగా లక్ష్మీపురం వరకు వెళ్తుంది. ఈ హైవే వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు వాహనాల రద్దీ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవేకు లైన్ క్లియర్
- ఈ హైవే డీపీఆర్ పూర్తి చేసిన అధికారులు
- త్వరలోనే పనులు ప్రారంభించేలా కసరత్తు

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్లో రూ.4245 కోట్లతో.. డీపీఆర్ రెడీ, ఆ జిల్లాకు మహర్దశ
ఈ నేషనల్ హైవేతో తెలంగాణకు, మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఖమ్మం నుంచి గ్రానైట్ను మచిలీపట్నం పోర్టుకు తరలించడం ఈజీగా ఉంటుందంటున్నారు. నూజివీడు మామిడి పండ్లను రవాణా అనుకూలంగా ఉంటుంది. ఈ హైవే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా వెళుతుంది.. దీంతో రాజధానికి కూడా జనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోతుందంటున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్కు కూడా ఉపయోగంగా ఉంటుంది. ఈ 216 హైవేుకు అనుసంధానంగా ఒంగోలు-కత్తిపూడి మధ్య ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులకు వీలుగా ఉంటుంది. డీపీఆర్ పూర్తి చేయడంతో అన్ని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.