Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్సూస్..! కీలక నిర్ణయాలు..! | Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits, Health Cards and PRC Report 2026

2 May 2026

Hyderabad: పెళ్లైన 2 నెలలకే భార్యభర్తల ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

2 May 2026

Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gandi Veeranjaneya Swamy Temple,గండి వీరాంజనేయస్వామి గుడిలో వివాదం.. ప్రధాన అర్చకుడి తీరుపై భక్తుల ఆగ్రహం.. – devotees criticize conduct of priests at gandi veeranjaneya swamy temple in ysr kadapa district
ఆంధ్రప్రదేశ్

Gandi Veeranjaneya Swamy Temple,గండి వీరాంజనేయస్వామి గుడిలో వివాదం.. ప్రధాన అర్చకుడి తీరుపై భక్తుల ఆగ్రహం.. – devotees criticize conduct of priests at gandi veeranjaneya swamy temple in ysr kadapa district

.By .2 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gandi Veeranjaneya Swamy Temple,గండి వీరాంజనేయస్వామి గుడిలో వివాదం.. ప్రధాన అర్చకుడి తీరుపై భక్తుల ఆగ్రహం.. – devotees criticize conduct of priests at gandi veeranjaneya swamy temple in ysr kadapa district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైఎస్ఆర్ కడప జిల్లా గండి వీరాంజనేయస్వామి ఆలయంలోని అర్చకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు హారతి పళ్లెంలో సమర్పించే డబ్బులను.. హుండీలో వేయడానికి ప్రధాన అర్చకుడు అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ భక్తుడు గండి ఆంజనేయస్వామి గుడిని సందర్శించారు. రూ.500 పెట్టి ఆకుపూజ టికెట్ కొనుగోలు చేశారు. అయితే టికెట్ కొనుగోలు చేసినప్పటికీ అర్చన సమయంలో అదనంగా రూ.200 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేశారని.. అదనంగా ఇస్తేనే పూజ చేస్తామని చెప్పినట్లు భక్తుడు వాపోయాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో గండి ఆలయంలో అర్చకుల తీరు వెలుగులోకి వచ్చింది.

హైలైట్:

  • గండి ఆలయంలో వివాదం
  • ప్రధాన అర్చకుడి తీరుపై విమర్శలు
  • అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని భక్తుల ఆరోపణ
Gandi Veeranjaneya Swamy Temple
గండి వీరాంజనేయస్వామి ఆలయం(ఫోటోలు– Samayam Telugu)
వైఎస్సార్ కడప జిల్లాలోని గండి వీరాంజనేయస్వామి ఆలయం .. రాయలసీమ జిల్లాలలో ప్రసిద్ధి చెందింది. గండి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కాలికి చిటికెన వేలు ఉండదు. ఆంజనేయస్వామి విగ్రహానికి చిటికెన వేలు చెక్కేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. విగ్రహం నుంచి రక్తం వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. దీని వెనుక అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇంతటి ప్రసిద్ధి చెందిన గండి వీరాంజనేయస్వామి గుడి.. ప్రధాన అర్చకుడి తీరు కారణంగా వివాదాల్లో నిలుస్తోంది. హారతి పళ్లెంలో భక్తులు సమర్పించే డబ్బుల విషయంలో అర్చకుల మధ్య విభేదాలు వస్తున్నాయంటూ ఇటీవలి కాలంలో పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నెల క్రితం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ హారతి పళ్లెంలో భక్తులు సమర్పించే కానుకలను హుండీలో వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గండి వీరాంజనేస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు కేసరి స్వామి.. డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయానికి అందాల్సిన కానుకలను కూడా తన జేబులోనే వేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదం చెలరేగింది.

తెలంగాణకు చెందిన భార్గవ్ అనే భక్తుడు శనివారం రోజున గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. రూ.516లు పెట్టి ఆకుపూజ టికెట్ కొనుగోలు చేశారు. అయితే టికెట్ ఉన్నప్పటికీ అదనంగా 200 రూపాయలు ఇస్తేనే పూజ చేస్తామని అర్చకులు డిమాండ్ చేసినట్లు భక్తుడు వాపోయారు. తాను ఇప్పటికే 516 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేశానని.. మళ్లీ 200 ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ గురుప్రసాద్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఆలయ ఇన్‌స్పెక్టర్ రవిచంద్రారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జయచంద్రారెడ్డిలను డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ వివరణ కోరారు.

మరోవైపు హారతి పళ్లెంలో వేసే కానుకలు హుండీలో వేయాలని గతంలోనే ఆదేశించామన్న డిప్యూటీ కమిషనర్.. శనివారం భక్తులు సమర్పించిన కానుకలను హుండీలో వేసేది లేదనీ అర్చకులు అన్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి హారతి పళ్లెంలో డబ్బులు హుండీలో వేయద్దని చెప్పడంతోనే హుండీలో వేయలేదని అర్చకులు చెప్పినట్లు తెలిసిందన్నారు. ఆలయ ఉద్యోగులు ఇచ్చిన వివరణను పరిశీలించి బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి