Amaravati Vijayawada West Bypass Connect: ఏపీలో మరో కీలకమైన బైపాస్ సిద్ధమవుతోంది. అమరావతికి ముఖ్యమైన విజయవాడ పశ్చిమ బైపాస్లో కొంతభాగం ఏప్రిల్ నెలలోపు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-విజయవాడ హైవేలో.. సంక్రాంతి సమయంలో ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి నుంచి చిన్నఅవుటుపల్లి మీదుగా మళ్లించిన సంగతి తెలిసిందే. అయతే ఏప్రిల్ నాటికి పాక్షికంగా బైపాస్ను అందుబాటులలోకి తీసుకురానున్నారు.. అమరావతికి త్వరగా వెళ్లే వీలు ఉంటుంది.
హైలైట్:
- ఏపీలో కీలక బైపాస్ అందుబాటులోకి
- విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్
- ఏప్రిల్ నాటికి వాహనాల రాకపోకలు

‘విజయవాడ-హైదరాబాద్ హైవే, కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్ప్లాజా దాటిన తర్వాత ఇ-8 (పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం) రోడ్లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తి చేస్తాం’అని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు 3 కిలోమీటర్లకు పైగా బ్రిడ్జి, మరో 4 కిలో మీటర్లు మేర ఆరు లైన్ల రోడ్డును కూడా అందుబాటులోకి రానుంది. అప్పుడు హైదరాబాద్ హైవే, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి వాహనాలు అమరావతికి రాకపోకలు కొనాసగించేందుకు దగ్గర దారి అవుతుంది.
‘రాజధానికి సంబంధించి.. ఇప్పుడు గొల్లపూడి, స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజి, కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లోకి రాకపోకలు జరుగుతున్నాయి’అంటున్నారు అధికారులు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై బ్రిడ్జి మీదుగా ప్రయాణించి ఇ-8 రోడ్లోకి వెళ్లొచ్చు.. అప్పుడు దాదాపు 10 కి.మీ. దూరం తగ్గుతుంది అని చెబుతున్నారు. ఏప్రిల్ నెల నాటికి గొల్లపూడి-కాజ మధ్య 17.88 కిలో మీటర్ల మేర ఆరు లైన్ల హైవే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఐదు గ్రిడ్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు లేకుండా బైపాస్ నిర్మిస్తుండగా.. కూటమి ప్రభుత్వం మాత్రం గ్రిడ్ రోడ్ల దగ్గర బైపాస్లో ఫ్లై ఓవర్ నిర్మించే పనులు చేపట్టనుంది. ఈ పనులు ఆలస్యం అవుతాయి.. అందుకే ఈలోపు పాక్షికంగా కొంతభాగం బైపాస్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.


