Tiruchanur Tourist Bus Stand Auction Update: తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్కు సంబంధించి ప్రతి ఏటా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2026-2027కు సంబంధించిన వేలం పాటూ కూడా పూర్తి చేశారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. కిరణ్ రెడ్డి రూ.3.1 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్లో పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు ఈ వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
హైలైట్:
- తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలం ప్రక్రియ పూర్తి
- రూ.31.5 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ కిరణ్ రెడ్డి
- ప్రతి ఏటా పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు వేలం

భక్తులకు ప్రాముఖ్యం ఉన్న తిరుచానూరు బస్టాండ్కు ప్రతి ఏటా వేలంపాట నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రైవేట్ టూరిస్ట్ బస్టాండ్లో పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు అధికారుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలంలో బస్టాండ్కు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి చాలామంది పోటీపడతారు. ఈ ఏడాది కూడా పోటీ నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. ముందస్తు జాగ్రత్తగా టూరిస్ట్ బంస్టాండ్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.డీఎల్పీవో సురేష్నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్, పంచాయతీ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించగా.. ఈ ఏడాది వేలం పాటలో టూరిస్ట్ బస్టాండ్ భారీగా పలికింది. ఈ కాంట్రాక్ట్ను కిరణ్రెడ్డి అనే వ్యక్తి రూ.3,15,40,000కు దక్కించుకున్నాడు. వాస్తవానికి మార్చి 31తో టూరిస్టు బస్టాండులో రుసుము వసూలు చేసేందుకు కాంట్రాక్టర్కు గడువు ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి పంచాయతీ అధికారులు పార్కింగ్ రుసుము వసూలు చేశారు. ఈ క్రమంలో వేలం పాట నిర్వహించారు.. అయితే కొత్త కాంట్రాక్టర్కు ఈ నెల 20 తర్వాతే బస్టాండ్ అప్పగిస్తారని.. 11 నెలలు మాత్రమే రుసుం వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. గతేడాది తిరుచానూరు టూరిస్టు బస్టాండు వేలంలో రూ.3.51కోట్లు పలికింది.. గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గింది.
గతేడాది తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంలో తీవ్ర ఉధ్రిక్తతకు దారితీసింది. ఈ కాంట్రాక్ట్ను దక్కించుకునేందుకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. అక్కడ టెండర్లు వేయడానికి వచ్చిన వారిని ఓ వర్గం అడ్డుకుంది.. టెండర్ పేపర్లను లాక్కుని పారిపోవడంతో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత వేలం పాట ప్రక్రియను చేపట్టారు.. వెంకటేషన్ అనే వ్యక్తికి వేలం దక్కింది. అయితే గతేడాది ఉద్రిక్తతల మధ్య సాగిన వేలం పాట ప్రక్రియ ఈ ఏడాది మాత్రం సాఫీగా జరిగింది.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


